Thursday, May 16, 2013

దీదీ మాట ... చూపాలి బాట !

పశ్చిమ బెంగాల్ నుండి డార్జిలింగ్ విభజన పై ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యలు నేటి ఈనాడు పత్రికలో ఇక్కడ చూడండి ....      
 
వేర్పాటు వాద నాయకుని సమక్షంలో సైతం నిర్మొహమాటంగా తన వైఖరి బైట పెట్ట గలిగిన ధైర్యం, దమ్ము మన రాష్ట్ర నాయకులలో ఎవరికైనా ఉందా? రెండు ప్రాంతాల  నాయకుల  వాదనలతో అధికార పక్షం, రెండు కళ్ళ సిద్ధాంతం తో ప్రధాన ప్రతి పక్షం సమస్యని మరింత జటిలం చేసాయే కానీ పరిష్కారం దిశగా ఒక్క అడుగు కూడా వెయ్యలెదు.  ఇంక సమస్య పరిష్కారం కోసం ఏర్పరచిన శ్రీ కృష్ణ కమిటీ నివేదిక ఏమయ్యిందో ఆ భగవంతుడికే ఎరుక... రాష్ట్రం లోని అన్ని ప్రాంతాలు పర్యటించి, రాష్ట్రంలోని అన్ని వర్గాల వారినుంచి సమాచారం సేకరించి-విశ్లేషించి-క్రోడీకరించి ఇచ్చిన కమిటీ నివేదిక ఏ చెత్త బుట్ట దాఖలయ్యిందో?  సమస్య పరిష్కారానికి ఆరు సూచనలు ఇచ్చి, అందులోనూ ఆరో సూచన అత్యుత్తమ పరిష్కారమని శ్రీ కృష్ణ కమిటీ నిగ్గు తేల్చింది. ఆ సూచనని సత్వరం అమలు పరచి వుంటే మన రాష్ట్రం ఈ పాటికి గుజరాత్ తో పోటీ పడ గల స్థితిలో వుండేది.  ఇప్పటికైనా రాష్ట్ర నాయకత్వం కళ్ళు తెరిచి, మమతా బెనర్జీ ని ఆదర్శంగా తీసుకొని, రాష్ట్ర విశాల ప్రయోజనాలు నెరవేర్చే దిశగా పయనిస్తే మంచిది...