Wednesday, May 7, 2014

సీమాంధ్ర రాజకీయ నాయకులను/పార్టీలను నేను తిరస్కరించాను !

అత్యంత హేయమైన పధ్ధతిలో, అవమానకరమైన రీతిన తెలుగు జాతిని, తెలుగు రాష్ట్రాన్ని విడగొట్టిన దుష్ట శక్తి కాంగ్రెస్ పార్టీ! ఇక బాధ్యతాయుతమైన ప్రతిపక్ష స్థానంలో వుండి కూడా, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన పరమ లోప భూయిష్టమైన ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లుని (అద్వానీ గారే సెలవిచ్చారు) - అనేక రాజ్యాంగ సవరణలు అవసరమైన పరిస్థితిలో కూడా వాటిని విస్మరించి కాంగ్రెస్ అకృత్యానికి వంత పాడిన చరిత్ర హీనమైన పార్టీ బీజేపీ ! మిగిలిన పార్టీల సంగతి చెప్పనక్కరలెదు. అవకాశ వాదమే తప్ప, అవమానానికి గురి అవుతున్న తెలుగు జాతికి అండగా నిలబడ్డ పార్టీ లేనే లెదు. అందుకే ఈ రోజు జరిగిన సార్వత్రిక ఎన్నికలలో నేను రంగంలో నిలబడ్డ అన్ని రాజకీయ పార్టీల అభ్యర్ధులని తిరస్కరిస్తూ నా వోటు "నోటా" కి వెసాను. మనది ప్రజాస్వామ్య దేశం. మెజారిటీ ప్రజల అభిమతం ప్రకారం ఏదేని రాజకీయ పార్టీ గాని, అభ్యర్ధి కానీ నెగ్గవచ్చు గాక...నా వ్యక్తిగత హోదాలో మాత్రం అవకాశ వాద పార్టీలను, వాటి అభ్యర్ధులను తిరస్కరించి సంతృప్తి చెందాను. వోటింగ్ మెషిన్ లో నోటా బటన్ ప్రవేశ పెట్టి తిరస్కార వోటుకి అవకాశం కలిగించిన భారత ఎన్నికల కమిషన్ వారికి ధన్యవాదాలు!