దేశంలోని మిగతా 28 రాష్ట్రాల మాదిరి తెలంగాణా  కూడా అంక్షలు లేని విధంగా ఏర్పరచాలని డిమాండ్ చేస్తున్న తెలబాన్ నాయకునికి దేశంలో మిగతా రాష్ట్రాలు ఏకాభిప్రాయం తో ఏర్పడ్డాయని,  సంప్రదాయానుసారం  విభజనకి పూర్వపు శాసన సభ తీర్మానం ద్వారానే ఆయా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకి నాంది జరిగిందని తెలియదా? కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలే కొత్త రాజదానులని ఏర్పాటు చేసుకున్నాయి కానీ ఉమ్మడిగా అభివృద్ది చెందిన రాజధానిని కైంకర్యం చేస్తూ అవశిష్ట ప్రాంతానికి మొండి చెయ్యి చూపించే విధంగా ఇంతకూ ముందు ఏ రాష్ట్రమైనా ఏర్పడిందా?   కానీ తెలంగాణా విషయంలో ఏం జరుగుతోంది ?  2009 డిసెంబర్ 9 ప్రకటనలో కేంద్ర హొమ్ మంత్రి తెలంగాణా ఏర్పాటుకై ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించగా, ఈనాడు   విభజన వాదులు కేంద్రంతో కుమ్మక్కు అయిన ఫలితంగా మొదటి ప్రక్రియనుండే  తొండి ఆట మొదలు పెట్టారు.    ఒక రాష్ట్ర  విభజన వంటి ప్రాముఖ్యమైన విషయం కేంద్ర కేబినెట్ సమావేశం ఎజెండా లో వుండదు..నోట్ తయారు అవుతున్న విషయం సాక్షాత్తు కేంద్ర హొమ్ మంత్రికి మధ్యాహ్నానికి తెలియదు...  కానీ సాయంత్రానికల్లా  టేబుల్ పాయింటు గా ప్రత్యక్షమై ఆమోదమై పోతుంది!   అలాగే మంత్రుల కూటమి! ఒక తెలుగు రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియలో ఒక్క తెలుగు మంత్రి కూడా ఉండడు.. మంత్రుల కూటమి కూడా హస్తిన వదలి రాదు.. కానీ చిత్తం వచ్చినట్లు నివేదిక తయారు చేయటంలో మాత్రం వారు సిద్ధ హస్తులు.  రెండు నెలలు కూర్చుని వారు వండి వార్చిన నివేదిక తో బిల్లు సిద్ధమయ్యాక కూడా మళ్ళీ అదే తంతు!  టేబుల్ పాయింటు గా కేబినేట్ సమావేశం లో బిల్లు ప్రవేశ పెట్టి -  సీమాంధ్ర మంత్రులు బిల్లు పరిశీలించటానికి సమయం అడిగినా నిరాకరించి బలవంతపు ఆమోదం జరిగిన సంగతి తెలిసిందే!  ఇక రాష్ట్రపతి నుండి తిరిగి వచ్చిన బిల్లుని  ప్రత్యెక దూత ద్వారా ప్రత్యెక యుద్ధ విమానంలో హైదరాబాదు కి పంపటం కొస మెరుపు!  ఈ అవకరాలన్నీ ఒక ఎత్తు ఐతే, తెలబాన్ల అరాచకాలు మరో ఎత్తు! ప్రత్యెక రాష్ట్ర ప్రస్తావనే లేని రోజుల్లోనే వారు చేసిన అరాచకాలకి లెక్కే లెదు.  
 సమైక్య రాష్ట్రంలో తెలంగాణా రాష్ట్రం పేరిట ఫలకాలు ఏర్పాటు చేయటం, వాహనాలకి టీజీ స్టిక్కర్లు అంటించటం, జాగో భాగో అనటం, తరిమి కోడతామనటం, పండక్కి వెళ్ళిన సీమాంధ్రులని తిరిగి రానివ్వమనటం, ఆస్తులు లాక్కుంటామనటం, సీమాంధ్రుల భూములు పంచేస్తామనటం ఇలా ఒకటా రెండా... అంతు లేని కధ ఆ అరాచకం!  అదంతా గతం!  ఇప్పుడు కేంద్రం ప్రత్యెక రాష్ట్రానికి సై  అనగానే తెలబాన్ నాయకుడు జూలు విదిల్చాడు.
 సాక్షాత్తు ముఖ్య మంత్రినే టిఫిన్ సెంటర్ పెట్టుకోమన్నాడు. తమకి కప్పం కడుతూ బతకమన్నాడు..ఉద్యోగులకి ఆప్షన్లు లేవన్నాడు..సీమాంధ్రకి వెళ్లి పోవాల్సిందే అన్నాడు.. నాయకుడు అలా వుంటే అనుచర గణం  ఇంకెలా వుంటుంది? 








