
ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చ గోట్టటంలో దిట్ట ఐన  కే సి ఆర్  ఈ మధ్య ఓ  పుష్కర పురాణం చెప్పాడు.  అదేమిటంటే  కృష్ణ పుష్కరాలు వస్తే విజయవాడ కే  పోవాల? గోదావరి పుష్కరాలు ఐతే రాజమండ్రి కే వెళ్ళాలా?  మా దగ్గర ఆ నదులు లేవా..అంటూ సాగింది ఆ పురాణ కాలక్షేపం.. 
ఇక్కడ  ఓ  సంగతి గమనించాలి.  ప్రాంతాలకి అతీతంగా  ఎవరికైనా వీసా కావాలి అంటే  అందరం చిలుకూరు బాలాజీ గుడికి వెళ్తున్నామా  లేదా ?  పిల్లలు గొప్ప చదువులు పొందాలని అక్షరాభ్యాసం బాసరలో  చేయిస్తున్నాము కాదా?  అలాగే ప్రతి ఊళ్ళోనూ  రామాలయం వున్నా  భద్రాచలం ఎందుకు వెళుతున్నాం?  ఇంకా  వేములవాడ, యాదగిరి గుట్ట , మెదక్ చర్చి, మక్కా మసీదు ..ఇవన్నీ జగత్ ప్రసిద్ధాలు కాదా??   అవన్నీ తెలంగాణా ప్రాంతంలోనే కదా వున్నాయి.. దీన్ని బట్టి  అర్ధం ఏమిటంటే,  పురాణ ప్రాశస్త్యం, ప్రజల నమ్మకాలను బట్టే ఆయా ప్రదేశాలకు యాత్రికులు వెళతారు మరియు ప్రభుత్వం కూడా  ఆ ప్రాధాన్యతని బట్టి ఏర్పాట్లు చేస్తుంది.  
ఈ చిన్న విషయాన్నీ కూడా వేర్పాటువాద దృష్టితో చూస్తూ విషం చిమ్మే కే సి ఆర్  మాటల్ని లైవ్ లో ప్రసారం చేస్తున్న మీడియా కూడా  దోషి అని చెప్పి తీరాలి. 
వెరీ గుడ్. బాగా చెప్పారు. ఇలాగే తెలబాన్ల అకృత్యాలను, ప్రేలాపనలను తిప్పికొట్టాలి.
ReplyDelete