భావోద్వేగాలలో చేసిన రాజీనామాలుగా చిత్రీకరిస్తూ తెలంగాణా ప్రాంత శాసన సభ్యుల రాజీనామాలని స్పీకర్ తిరస్కరించటం సరైన చర్య కాదు. గతంలో కూడా స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డి వున్నప్పుడు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. కానీ ఆనాటి పరిస్థితులు వేరు. దొంగ దీక్షలతో మభ్యపెట్టి, అన్ని పార్టీల అంగీకారం ఉందన్న తప్పుడు సమాచారం అందించి రాత్రికి రాత్రి తెలంగాణా అనేసరికి ఒక్కసారిగా వచ్చిన భావోద్వేగ పరిణామమే సీమాంధ్ర శాసన సభ్యుల, ఎంపీల రాజీనామాలు! కానీ ఇప్పటి పరిస్థితి వేరు.. తెలంగాణా రావటంలేదన్న నిస్పృహ కావచ్చు.. లేదా నియోజక వర్గాల్లో తిరగనివ్వమన్న వేర్పాటు తీవ్ర వాదుల ఫత్వాలకి భయపడి కావచ్చు..రాజీనామా ఇచ్చిన వారంతా ఫలానా తేదీన ఇస్తామని ముందే చెప్పారు. ఆ విధంగానే చేసారు. ఇంక ఇందులో భావోద్వేగాలకు చోటెక్కడ? రాజీనామాలు తిరస్కరించటం అన్నది స్పీకర్ విచక్షణాదికారమే కావచ్చు. కానీ దానికి భావోద్వేగాల ముద్ర వేయటం తప్పు. ఇలా నిర్ణయించే ముందుగా శాసన సభ్యులందరినీ విడి విడిగా స్పీకర్ విచారించి వుంటే, వారిలో ఎందరు స్వచ్చందంగా రాజీనామా ఇచ్చారో, ఎంత మంది ఒత్తిడి కి లోనై ఇచ్చారో తేట తెల్లమయ్యేది! అలాగే కృత్రిమంగా కొనసాగింప బడుతున్న తెలంగాణా ఉద్యమం పట్ల ఆ ప్రాంత శాసన సభ్యుల నిబద్ధత కూడా బయట పడేది! రాష్ట్రాన్ని రావణ కాష్టంలా రగిలిస్తున్న ఉద్యమం పట్ల ఒక అంచనాకి వచ్చే అరుదైన అవకాశాన్ని స్పీకర్ చేజేతులా జార విడిచారనటంలో ఏ మాత్రం సందేహం లేదు. Sunday, July 24, 2011
స్పీకర్ తప్పుడు నిర్ణయం!
భావోద్వేగాలలో చేసిన రాజీనామాలుగా చిత్రీకరిస్తూ తెలంగాణా ప్రాంత శాసన సభ్యుల రాజీనామాలని స్పీకర్ తిరస్కరించటం సరైన చర్య కాదు. గతంలో కూడా స్పీకర్ గా కిరణ్ కుమార్ రెడ్డి వున్నప్పుడు ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు. కానీ ఆనాటి పరిస్థితులు వేరు. దొంగ దీక్షలతో మభ్యపెట్టి, అన్ని పార్టీల అంగీకారం ఉందన్న తప్పుడు సమాచారం అందించి రాత్రికి రాత్రి తెలంగాణా అనేసరికి ఒక్కసారిగా వచ్చిన భావోద్వేగ పరిణామమే సీమాంధ్ర శాసన సభ్యుల, ఎంపీల రాజీనామాలు! కానీ ఇప్పటి పరిస్థితి వేరు.. తెలంగాణా రావటంలేదన్న నిస్పృహ కావచ్చు.. లేదా నియోజక వర్గాల్లో తిరగనివ్వమన్న వేర్పాటు తీవ్ర వాదుల ఫత్వాలకి భయపడి కావచ్చు..రాజీనామా ఇచ్చిన వారంతా ఫలానా తేదీన ఇస్తామని ముందే చెప్పారు. ఆ విధంగానే చేసారు. ఇంక ఇందులో భావోద్వేగాలకు చోటెక్కడ? రాజీనామాలు తిరస్కరించటం అన్నది స్పీకర్ విచక్షణాదికారమే కావచ్చు. కానీ దానికి భావోద్వేగాల ముద్ర వేయటం తప్పు. ఇలా నిర్ణయించే ముందుగా శాసన సభ్యులందరినీ విడి విడిగా స్పీకర్ విచారించి వుంటే, వారిలో ఎందరు స్వచ్చందంగా రాజీనామా ఇచ్చారో, ఎంత మంది ఒత్తిడి కి లోనై ఇచ్చారో తేట తెల్లమయ్యేది! అలాగే కృత్రిమంగా కొనసాగింప బడుతున్న తెలంగాణా ఉద్యమం పట్ల ఆ ప్రాంత శాసన సభ్యుల నిబద్ధత కూడా బయట పడేది! రాష్ట్రాన్ని రావణ కాష్టంలా రగిలిస్తున్న ఉద్యమం పట్ల ఒక అంచనాకి వచ్చే అరుదైన అవకాశాన్ని స్పీకర్ చేజేతులా జార విడిచారనటంలో ఏ మాత్రం సందేహం లేదు. Thursday, July 21, 2011
అసెంబ్లీ రౌడీలు!
పై అధికారుల ఆదేశానుసారం తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తిస్తున్న ఏపీ భవన్ ఉద్యోగి పై, శాసన సభ్యుడినన్న అహంకారంతో ఒళ్ళు మదించిన తెలబాన్ మేనల్లుడు హరీష్ రావు చేసిన దౌర్జన్యం సహించరానిది. టీవీ కెమెరాల సాక్షిగా ఏపీ భవన్ ఓ ఎస్ డీ చంద్ర రావు పై హరీష్ రావు చేసిన దాడిని చూసిన దేశం మొత్తం నిర్ఘాంత పోయింది. చేసిన ఘన కార్యం చేసేసి, ఆనక తీరిగ్గా విచారిస్తున్నానంటూ క్షమాపణ చెప్పేస్తే చాలదు. ఇటువంటి అసెంబ్లీ రౌడీలని, అసెంబ్లీ రౌడీ సినిమాలో చూపించిన విధంగానే నడి వీధికి తెచ్చి, టీవీ కెమెరాల సాక్షిగా అదే ఉద్యోగి చంద్ర రావు చేత కుళ్ళ బొడిపించేయ్యటమే వారికి చెయ్యాల్సిన శాస్తి!
Wednesday, July 20, 2011
కాంగ్రేసు ని తెలుగు వారు క్షమించరు!
కేంద్రంలో యూ పీ ఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటానికి వెన్ను దన్నుగా మంది 33 మంది ఎంపీ లని అందించిన ఆంద్ర రాష్ట్రాన్ని ఏడాదిన్నర పాటు రావణ కాష్టంలా రగిలించాక, తీరిగ్గా ప్రణబ్ ముఖర్జీ గారు డిసెంబరు 9 ప్రకటన సమాచార లోపంతో ఇచ్చిన పొరపాటు ప్రకటనగా తేల్చేసారు. ఇదే విషయమై నేను రాసిన ఇంతకు ముందు టపా ఇక్కడ చదవచ్చు. http://andhraaakasaramanna.blogspot.com/2010/02/blog-post_17.html
ఆంద్ర ప్రదేశ్ లో స్వపక్షం లేదా విపక్షం ఎవరు అధికారంలో వున్నా కూడా మన రాష్ట్రం పట్ల కాంగ్రేసుకి ఎప్పుడూ సవతి తల్లి ప్రేమే! నిన్నటి వరకూ రాష్ట్ర విభజన విషయం తేల్చాల్సింది అధిష్టానమే-సోనియా నే అంటూ రాష్ట్ర నాయకత్వం భజన చేస్తుంటే చోద్యం చూస్తూ ఉండి....ఈ రోజు తెలుగు వారి సమస్యని తెలుగు వారే సామరస్యంతో పరిష్కరించుకోవాలంటూ సుద్దులు చెప్పటం కాల్చి వాత పెట్టి వెన్న రాసినట్లే ఉంది. ఇంతోటి పరిష్కారం చెప్పటానికి ఏడాదిన్నర సమయం తీసుకోవాలా? తదుపరి పరిణామాలు ఊహించకుండా తొందర పాటుతో డిసెంబరు 9 ప్రకటన చేసేసి, రాష్ట్రాన్ని తగల పెట్టి, అభివృద్ధిని దశాబ్దాల వెనక్కి నెట్టిన కాంగ్రేసు పార్టీని తెలుగు వారు ఎన్నటికీ క్షమించరు.
Sunday, July 17, 2011
దయ్యాలు వేదాలు వల్లిస్తున్నాయి!
సీమాంధ్ర మంత్రి తోట నరసింహం పై తెలబాన్లు దౌర్జన్యం చేసిన దరిమిలా తమకు రక్షణ కరువైందని వాపోయిన మంత్రి టీజీ వెంకటేష్ రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ హరీష్ రావు చేసిన ప్రకటన దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లే ఉంది. ఆయన పై సు మోటో గా కేసు బుక్ చేయాలనీ, మంత్రి పదవినుంచి తొలగించాలనీ ఇంకా చాల డిమాండ్లు చేసారు. గురువింద గింజ మాదిరిగా ఆరోపణలు చేసే ముందు తమ కింద ఎంత నలుపు వుందో తెలుసుకోక పోవటం ఆశ్చర్యకరం! ఆంధ్రా వాలే భాగో....నాలుకలు కోస్తాం.. సీమాంద్రులని తరిమి కొడతాం... వారి ఆస్తుల్ని లాక్కుంటాం..ఇలా ఒకటా రెండా? ఎన్నెన్ని ప్రేలాపనలు! ఉద్యమం ముసుగులో ఏమి చేసినా, ఏమి వాగినా చెల్లి పోతుందన్న ధీమాలో చేసిన అకృత్యాలు ఎన్ని?
సు మోటో గా కేసులు బుక్ చేయాల్సి వస్తే ముందు తెలబాన్ల పైన బుక్ చేయాల్సిన కేసులు లెక్కకి అందవు.
గీతా ఆర్ట్స్ కార్యాలయాన్ని ఆక్రమించి తెలంగాణా బేనర్ కట్టటం... మర్యాద రామన్న షూటింగ్ అడ్డుకొని యూనిట్ సభ్యులతో బలవంతంగా జై తెలంగాణా అనిపించటం...అదుర్స్ సినిమాని ఆడనివ్వబోమని బెదిరించడం...వాహనాలపై టీజీ స్టికర్లు వుండాలని హుకుం లు జారీ చేయటం...రాష్ట్రం రాకుండానే రాజ ముద్రని చలామణీ లోకి తేవటం..ఇలా చెప్పుకుంటూ పొతే కేసులు బుక్ చేయాల్సిన సంఘటనలు కోకొల్లలు.
అవన్నీ ఒకెత్తు. శాసన సభ్యుడైన నాగం ని (తెలుగు దేశంలో వుండగా) చితక్కొట్టటం, నిజాల్ని నిక్కచ్చిగా మాట్లాడినందుకు టీవీ కెమెరాల సాక్షిగా కొట్టండి రా వాణ్ని అంటూ జే పీ పై భౌతిక దాడికి దిగటం, పొట్టి శ్రీరాములు, ఎన్టీఆర్ విగ్రహాలని ద్వంసం చేయటం ఆటవిక చర్యలు కావా? వాటి పై చర్యలు తీసుకోకూడదా ?
అన్నిటికన్నా దారుణం..తెలుగు జాతి చరిత్రకి సగర్వ సాక్షులైన టాంకు బండ్ విగ్రహాల్ని ద్వంసం చేయటం. అందుకుగాను మిలియన్ మార్చ్ నిర్వాహకులని శిక్షించటం...ఆధ్వర్యం వహించిన పార్టీని నిషేధించటం చెయ్యాలి. కానీ అటువంటి చర్యలేమీ తీసుకోకుండా ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చో బట్టే నేడు తెలబాన్లు ఉద్యమం ముసుగులో అరాచకాలు సాగిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన అలుసు పెచ్చు మీరటంతో, ప్రభుత్వంలో భాగమైన మంత్రినే వేలెత్తి చూపుతున్నారు. కానీ ఒక వేలెత్తి చూపితే, నాలుగు వేళ్ళు తమకేసే చూస్తాయన్న నిజం మూర్ఖ తెలబాన్లకి ఎప్పుడు అర్ధం అవుతుందో?
Thursday, July 14, 2011
అరాచకత్వానికి హద్దే లేదా?
రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే అసలు ఇక్కడ ప్రభుత్వం అనేది పని చేస్తోందా అని సందేహం వస్తోంది. వేర్పాటు వాదం వెర్రి తలకెక్కి రైల్ రోకో అనగానే ప్రభుత్వమే ముందుగా రైళ్ళని రద్దు చేయటం చేతగాని తనమే. రైళ్ళ రద్దు వల్ల ఏర్పడే కోట్లాది రూపాయల నష్టానికీ, ప్రయాణీకుల కష్టాలకీ బాధ్యత ఎవరిది? ముమ్మాటికీ ఈ చేతకాని ప్రభుత్వానిదే.. ఉద్యమం ముసుగులో తామేం చేసినా చెల్లి పోతుందన్న అభిప్రాయం ఇప్పటికే తెలబాన్ల నర నరాల్లో జీర్ణించుకు పోయింది. దానికి తోడు ప్రభుత్వమే చేవ చచ్చిన రీతిలో ఇలా తోక ముడిచేయడం ఏ మాత్రం క్షంతవ్యం కాదు. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ముందు తన ఉద్యోగులనే కట్టడి చేయలేక పోతోంది. ప్రజలు కట్టిన పన్నులతో జీతాలు తీసుకుంటూ ప్రజా సేవ చేయాల్సిన ఉద్యోగులు అర్ధం పర్ధం లేని డిమాండ్లతో ఆగష్టు ఒకటినుండి పని చేయ బోమని బెదిరించటం ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చిన అలుసే. తెలుగు వారి చరిత్రకి సగర్వ సాక్ష్యాలైన టాంకు బండు విగ్రహాల్ని కూల్చిన వారిపై ఈ రోజు వరకు చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇక ఈ రోజు నల్గొండ జిల్లా చుట్టూ గోడ కట్టేస్తామని బెదిరించాడో మాజీ మంత్రి! అసలు తెలంగాణా ఉద్యమ వాదంలో సహేతుకత ఎంత వుంది, ఈ సమస్యకి అత్యుత్తమ పరిష్కారం ఏమిటి తదితర విషయాలన్నీ శ్రీకృష్ణుడు ఏనాడో కుండ బద్దలు కొట్టేసాడు. అయినా కూడా ప్రభుత్వం మీన మేషాలు లెక్కిస్తూ ప్రజలు ఇబ్బందుల పాలవుతుంటే చోద్యం చూస్తూ కూచోటం క్షమార్హం కాదు. కేంద్ర ప్రభుత్వం ఇకనైనా వేచి చూసే ధోరణి మాని రాష్ట్రం లో పరిస్థితులు గాడిన పడే వరకు రాష్ట్రపతి పాలన విధించాలి. శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన ఆరో అత్యుత్తమ పరిష్కారం అమలుకి చిత్త శుద్ధితో కార్యాచరణ సాగించాలి. తద్వారా దేశంలో ఇతర ప్రాంతాల్లో వేర్పాటు వాదాలు ప్రబలకుండా నివారణ చర్యలు తీసుకోవాలి.
Wednesday, June 22, 2011
నివాళి ఇచ్చే విధానం ఇదా?
ఆచార్య జయశంకర్ వంటి మేధావిని, విద్యా వేత్తని కోల్పోవటం కేవలం తెలంగాణా ప్రాంతానికే కాదు...తెలుగు వారందరికీ తీరని లోటే. విద్యా రంగంలో ఆయన మన రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయం. అలాగే తాను నమ్మిన సిద్దాంతం పట్ల నిబద్ధత, తన సిద్ధాంత వ్యాప్తి కోసం ఎంచుకున్న గాంధేయ మార్గం కూడా మెచ్చ దగ్గవి. అయితే ఆయన మరణానంతరం నివాళి అర్పించటానికి వచ్చిన తెలంగాణా నాయకులని తెలబాన్ శ్రేణులు చొక్కాలు చిరిగేలా కొట్టటం, రాళ్ళతో దాడి చేయటం ఎ మాత్రం సమర్ధనీయం కాదు. జయ శంకర్ కూడా జీవించి వున్నప్పుడు ఎటువంటి హింసా వాదాన్ని సమర్ధించలేదు. వసూళ్ళ నాయకుల చేతిలో పడి తెలంగాణా ఉద్యమం ఏనాడో పెడ తోవ పట్టింది. కనీసం ఉద్యమ సిద్ధాంత కర్త మరణించిన విషాద సమయంలో సైతం సంయమనం లేకుండా తెలబాన్ శ్రేణులు ప్రవర్తించాయి. జయ శంకర్ అంతిమ యాత్ర జరిగిన సమయంలో కూడా రెచ్చి పోయిన తెలబాన్లు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం పై రాళ్ళతో చెప్పులతో దాడి చేయటం పెచ్చరిల్లిన ఉన్మాదానికి పరాకాష్ట. ఉద్యమం ముసుగులో ఏమి చేసినా చెల్లి పోతుందనే ధీమా వారి చర్యల్లో కన పడుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కి అత్యంత ప్రియమైన టాంక్ బండ్ విగ్రహాలని కూలదోసి ఆయన ఆత్మని క్షోభింప జేసిన తెలబాన్లు ఇక ఏకంగా ఆయన విగ్రహాలపైనే ప్రతాపం చూపారు. ఈ అరాచకత్వాలని ఇక ఎంత మాత్రం సహించకూడదు. ప్రభుత్వం అనేది ఒకటి ఉందన్న స్పృహ కూడా లేకుండా పెచ్చరిల్లుతున్న వేర్పాటు తీవ్ర వాద గణాల భరతం పట్టే దిశగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతైనా వుంది
Sunday, June 19, 2011
లగడపాటి లెక్కలో తప్పేముంది?
దొంగ దీక్షలతో కేంద్రాన్ని ఏమార్చి 2009 డిసెంబరు తొమ్మిదిన తెలంగాణకి అనుకూలంగా ప్రకటన ఇచ్చిన నాడు, అందరికంటే ముందుగా అప్రమత్తమై రాష్ట్రాన్ని ముక్కలు గాకుండా కార్యాచరణకి దిగిన వాడు లగడపాటి రాజగోపాల్. ఆయన వ్యక్తిగతంగా వ్యాపారి కావచ్చు. ఆయన వ్యాపార ప్రయోజనాలు హైదరాబాదు లో విస్తరించి ఉండవచ్చు. అది వేరే విషయం. అయితే ఉత్తి పుణ్యానికే రాష్ట్రాన్ని ముక్కలు చేద్దామని జూసిన వేర్పాటు వాదుల కుట్రలు భగ్నం చేస్తూ సమైక్యాంధ్ర ఉద్యమ నావకి చుక్కానిలా నిలిచిన రాజ గోపాల్ అంటే తెలబాన్లకి కంటగింపుగా వుండటం సహజమే. ఆనాటి నుంచి లగడపాటి ఏం మాట్లాడినా దుమ్మెత్తి పోయడం అన్నది తెలబాన్లకి అలవాటుగా మారింది.
తాజాగా-- రాష్ట్రంలో ఎన్నికలు వస్తే సమైక్య వాదులకి 240 ,వేర్పాటు వాదులకి 40 సీట్లు వస్తాయి -- అన్న లగడపాటి ప్రకటన పై తెలబాన్ శ్రేణులు శాపనార్ధాలు పెట్టటం ప్రారంభించాయి. తాను నిర్వహించిన సర్వే లో ఈ విషయం వెల్లడైందని రాజ గోపాల్ అంటున్నప్పుడు, చేతనైతే ఆ సర్వే అబద్ధమని నిరూపించాలి గానీ వ్యక్తిగత దూషణలకి దిగటం చేతకాని తనం. రాష్ట్రాన్ని విభజిస్తే ఏర్పడే పరిణామాలు అంటూ రాజ గోపాల్ చెప్పినవి అన్నీ శ్రీ కృష్ణ కమిటీ 8 వ అధ్యాయంలో వున్నవే. లగడపాటి సొంత సర్వే లని పక్కన పెడితే, కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ రాష్ట్రంలోని పరిస్థితుల్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసి సమస్యకి తగిన పరిష్కారాలని సూచించి ఆరు నెలలు గడిచి పోయాయి. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం మీన మేషాలు లెక్కించటం మాని, శ్రీ కృష్ణ కమిటీ సూచించిన ఆరవ అత్యుత్తమ పరిష్కారం అమలు పరిచే చర్యలు చేపట్టాలి. గోర్ఖాలాండ్ మాదిరిగానే రాష్ట్రంలో వెనుక బడ్డ తెలంగాణా, ఉత్తరాంధ్ర, రాయల సీమల్లోని ప్రాంతాలకి ప్రత్యెక ప్యాకేజీలు ప్రకటించి వాటి సత్వర అభివృద్ధికి బాట వేయాలి. తద్వారా ఎటువంటి వేర్పాటు వాద ఉద్యమాలు భవిష్యత్తులో తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
వంట చేసి ఏం సాధించారు?

త్యాగాల వల్ల తప్ప వేరే విధంగా తెలంగాణా రాదని సెలవిస్తూనే వంటా వార్పూ అంటూ తెలబాన్ నాయకుడు చేసిన హడావిడికి అర్ధం పరమార్ధం ఏమిటో ఆయనకే తెలియాలి. ఓ పక్క కాంగ్రెస్, తెదేపా నాయకులని రాజీనామాలు చేయమని హుంకరిస్తూనే, తానూ, తన తెలబాన్ చెల్లి ఈ రోజుకి కూడా రాజీనామా ఊసు ఎందుకు ఎత్తరో ఏనాడు వివరించిన పాపాన పోలేదు. నిజంగా ఉద్యమం పట్ల చిత్త శుద్ధి, నిబద్ధత గల పెద్ద మనిషి ఐతే మొదటి సారి రాజీనామా తిరస్కరణకి గురి అయ్యాక మళ్ళీ సరైన ఫార్మాట్లో రాజీనామా ఇవ్వాలన్న విషయం ఎవరైనా చెప్పాలా? తాను పదవిని పట్టుకుని వేళ్ళాడుతూ ఇతరులని రాజీనామా చేయాలని వత్తిడి చెయ్యటం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాల కిందకే వస్తుంది. ఇలా వంటలు చేస్తూ, వసూళ్లు చేస్తూ ఉద్యమ నాయకుడుగా చెలామణీ కావటం బహుశా వేరెవరికీ సాధ్యం కాక పోవచ్చు. ఇక తెలబాన్ జే ఎ సి నాయకుడిదీ అదే తంతు! తన ప్రొఫెసర్ పదవికి రాజీనామా ఇవ్వడు కానీ.. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలు కట్టిన పన్నుల్లోంచి జీతం తీసుకుంటూ ఒక ప్రాంతానికి అనుకూలంగా మాట్లాడతాడు. అనుకూలంగా మాట్లాడితే తప్పు లేదు. కానీ ఇతర ప్రాంతాల పై, ప్రాంతీయుల పై విద్వేషాగ్నుల్ని రగిలించడం క్షంతవ్యం కాదు. ఏమైనా ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రం కొత్తగా చిన్న రాష్ట్రం ఏర్పాటు చేసి కొరివితో తల గోక్కునే అవకాశం లేనే లేదు. అది తెలంగాణా కాంగ్రెస్ నాయకుల డిల్లీ పర్యటనలో వారి పట్ల హై కమాండ్ చూపిన మర్యాదే తెలియ జేసింది. ఇంకా వంటా వార్పూ, డెడ్ లైన్, రాజీనామా అంటూ ప్రజలని ఏమార్చడం సాధ్యం కాదు. పైగా మిలియన్ మార్చ్ అంటూ పేర్లు పెట్టి జనాల్ని సమీకరించి రాష్ట్ర చారిత్రిక సంపద ఐన విగ్రహాలని కూల్చి వేయడం క్షమించరాని నేరం. ఇప్పటికే రాష్ట్రానికి కోలుకోలేని నష్టం జరిగి అభివృద్ధి అనేది ఆమడ దూరం వెళ్ళింది. ఇంకా ఇటువంటి అర్ధం పర్ధం లేని ఉద్యమాలని ప్రభుత్వం ఎంత మాత్రం సాగనీయకూడదు. రాష్ట్ర హితానికి వ్యతిరేకంగా, ప్రజలని అసౌకర్యాల పాలు జేసే విధంగా సాగే ఎటువంటి కార్య కలాపాలని అయినా ఉక్కు పాదంతో అణచి వేస్తేనే మళ్ళీ రాష్ట్రాభివృద్ధి గాడిలో పడుతుంది.
Saturday, June 11, 2011
దళిత కార్డు దుర్వినియోగం కాకూడదు..
ఎంపీ నన్న అహంకారంతో విద్యుత్ శాఖ ఉద్యోగి పైన నోరు పారేసుకున్న సర్వే సత్య నారాయణ ఉద్యోగుల సంఘీభావానికి తోక ముడిచి క్షమాపణ చెప్పారు. ప్రోటోకాల్ విషయమై తప్పు జరిగిందని ఆరోపిస్తూ విద్యుత్ శాఖ ఉద్యోగి పై బూతుల పంచాంగం విప్పిన పార్లమెంటు సభ్యుడు, ఆ శాఖ ఉద్యోగులు అందరూ సంఘీభావంతో
ఒక్కటిగా నిలబడటంతో దిక్కు తోచక కులం కార్డుని వెలికి తీసారు. ఎస్.సి. ఎస్.టీ. చట్టం కింద కేసు పెడతాననీ, స్పీకర్ కి ఫిర్యాదు చేస్తాననీ పరి పరి విధాల బెదిరించారు. అయినా కూడా ఉద్యోగులు వెరవక పోవటంతో తప్పని సరై క్షమాపణలు చెప్పారు. ఎంపీ స్థానంలో ఉన్న వాడే ఉచితానుచితాలు గ్రహించకుండా స్వల్ప వివాదానికి సైతం దళిత కార్డుని వాడ బూనటం ఔచిత్యం అనిపించుకోదు. ఎంపీ గారే కాదు. చాల మంది మన దేశంలో ఒక దళితుడిని తప్పు పడితే చాలు..అంబేద్కర్ ని అవమానించినంత హడావిడి చేస్తారు. పుట్టుక రీత్యా దళితుడైనంత మాత్రాన అన్ని తప్పులనించి ఇమ్యూనిటీ వున్నట్లు ప్రవర్తించటం మంచిది కాదు. రాజ్యాంగం తమకి కల్పించిన వెసులుబాటుని తమ పురోభివృద్ధికై వాడుకోవాలి గానీ ఇలా దుర్వినియోగం చేయడం కూడదు.
Monday, May 23, 2011
ఎస్ ఆర్ సీ బొమ్మలాట కాదు..
తెలంగాణా చిచ్చుని రగిల్చి ఇప్పటికే రాష్ట్రాన్ని అధో గతి పాల్జేసిన కేంద్రం తాజాగా సార్వత్రిక ఎన్నికల వరకు కాల యాపన చేయటానికి వీలుగా రెండో ఎస్.ఆర్.సీ అస్త్రాన్ని బైటకి తీస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణా విషయమై ఎటూ తేల్చుకోలేక సతమతమవుతున్న జగన్, చంద్ర బాబు లాంటి వారిని మరింత ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టటానికి కాంగ్రేసు కి ఉన్న ఈ అవకాశం జార విడుచుకోదు. తమ స్వార్ధ పూరిత రాజకీయాల కోసం తెలుగు వారిని చదరంగంలో పావుల్లా వాడుకోవటం, తెలుగు రాష్ట్రాన్ని ఎల్ల వేళలా వంచించటం కాంగ్రెసుకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు ఎస్.ఆర్.సీ పేరుతొ ఆడ బోయే నాటకం కూడా అదే. అయితే ఎప్పుడో 1955లోనే ఫజల్ అలీ నేతృత్వంలో ఏర్పడిన మొదటి ఎస్సార్సీ ఇక్కడి పరిస్థితుల్ని కూలంకషంగా అధ్యయనం చేసి తద్వారా ఇచ్చిన నివేదిక ఆధారంగానే విశాలాంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయ్యింది. ప్రత్యెక తెలంగాణా, ప్రత్యెక హైదరాబాదు వాదనలు ఎంత డొల్లవో కమిషన్ ఆనాడే కుండ బద్దలు కొట్టింది. ఆ వివరాలన్నీ కమిటీ రిపోర్టు 369 నుండి 389 వరకు గల పేరాలలో వివరంగా చర్చించడం జరిగింది.
http://en.wikipedia.org/wiki/Para_369_to_389_of_SRC
పోనీ అర్ధ శతాబ్దం తరువాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందనుకున్నా..తాజాగా కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేసిన శ్రీ కృష్ణ కమిటీ కూడా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటమే అత్యుత్తమ పరిష్కారమంటూ తేల్చి చెప్పింది. అంతే కాదు. ఝార్ఖండ్, చత్తీస్ గడ్ వంటి చిన్న రాష్ట్రాల ఏర్పాటు వల్ల మావోయిష్టుల వంటి తీవ్రవాద దళాల చర్యలు పెచ్చుమీరటంతో పాటు రాజకీయ అనిశ్చితి కూడా సంభవమేనని సవివరంగా నివేదించింది. ఇప్పటికైనా కేంద్రం తెలుగు వారి భవిష్యత్తుతో, వారి అభివృద్ధితో ఆటలాడుకోవటం మానాలి. చేతనైతే సరైన పాలకుణ్ణి పెట్టుకొని సమైక్య రాష్ట్రం అభివృధికి తోడ్పడాలి. లేదా తమ వల్ల కాదనుకుంటే రాష్ట్రపతి పాలన విధించి అభివృది నిరోధకంగా మారిన వేర్పాటు వాదాన్ని తుదముట్టించాలి. లేని పక్షంలో తదుపరి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగు వాడి ఆగ్రహ జ్వాలకి కాంగ్రేసు పార్టీ ఆంధ్ర ప్రదేశ్ లో తుడిచి పెట్టుకు పోవటం ఖాయం.
Subscribe to:
Comments (Atom)






