Wednesday, February 17, 2010

పొరపాటుని సరి దిద్దండి..


అర్ధ శతాబ్దం పైన సాగుతున్న తెలంగాణా ఉద్యమం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న స్థితిలో వుంది. అలాంటిది ఇప్పుడు కనీసం పరిస్థితుల అంచనాల కోసం అధికారికంగా ఒక కమిటీ వచ్చిందని సంతోషించక తెలంగాణా భీభత్స వాదులు ఎంత సేపూ చిదంబరం గారి డిసెంబర్ 9 ప్రకటన పట్టుకొని వేళ్లాడుతూ నానా యాగీ చేస్తున్నారు. అసలు తెలంగాణా ప్రక్రియ మొదలు పెడతామని చిదంబరం ప్రకటన చేయటమే పొరపాటు. తెలంగాణా ప్రక్రియ అనకుండా రాష్ట్ర విభజన కోసం ప్రక్రియ మొదలు పెడతాం అని వుంటే గొడవ వుండేది కాదు. ఎవరి సెంటి మెంట్లు హర్ట్ అయ్యేవి కాదు. రాత్రికి రాత్రి తెలంగాణా అనేసరికి ఇతర ప్రాంతాలవారు సహజంగానే హర్ట్ అయ్యారు. రాష్ట్రం తగలబడటం మొదలైంది. పొరపాటు జరిగింది సరే, ఏ పరిస్థితిలో జరిగింది ఆలోచించాలి. ఆ సమయంలో కేంద్రానికి రెండు కళ్ళుగా ఉండి, సరైన సమాచారం అందించాల్సిన వారు ఎం చేస్తున్నారు? ముఖ్య మంత్రి రోశయ్య నాకేం బాధ్యత లేదు అంతా హై కమాండు దే అని నెత్తిన తడి గుడ్డ వేసుకొని కూర్చున్నాడు. రెండో కన్నుగా చూడాల్సిన గవర్నర్ తివారీ రాస లీలలలో మునిగి తేల్తున్నాడు. విధి లేని పరిస్థితిలో కేంద్రం తన దగ్గరున్న సమాచారంతో (కాంగ్రెస్స్ ఓకే అంటే మేమూ ఓకే అని ప్రతి పక్షాలు ఇచ్చిన లేఖలు) ఒక ప్రకటన చేసింది. అది నిస్సందేహంగా ఒత్తిడుల మధ్య, సరైన సమాచారం లేని పరిస్థితుల్లో ఇచ్చిన పొరపాటు ప్రకటన. ఆ విషయం తదనంతరం జరిగిన పరిణామాలే రుజువు చేసాయి. ఇప్పటికైనా మించి పోయింది లేదు. కేంద్రం భేషజాలకు పోకుండా డిసెంబరు 9 వ తేదీ ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. శ్రీ కృష్ణ కమిటీ రిపోర్టు వచ్చాక పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటామని నిర్ద్వందంగా ప్రకటించాలి. రాష్ట్రం లో సత్వరం రాష్ట్రపతి పాలన విధించాలి. అప్పుడే మన రాష్ట్రం లో ప్రశాంతత నెలకొంటుంది.

2 comments:

  1. Raatriki Raatri ?????????????????????

    ReplyDelete
  2. అవును. రాత్రికి రాత్రే...ఏమైనా సందేహమా?

    ReplyDelete