Saturday, August 25, 2012

తెలుగు వాడి పౌరుషం ఎప్పుడో చచ్చి పోయింది!

కేంద్రం లో యూ పీ ఏ ప్రభుత్వానికి ఆక్సిజన్ లాగా 33 మంది ఎమ్పీలని అందించిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి కేంద్ర మంత్రి ముందు ఏ భంగిమలో ఉన్నాడో చూడండి...ఒక పక్క రైల్వే సౌకర్యాలన్నీ ఇతర రాష్ట్రాల వాళ్ళు తన్నుకు పోతూ మనకి ముష్టి విదిలిస్తున్నా అడిగే దిక్కు లేదు...అలాగే కనీసం మన సొంత గ్యాస్ కూడా మనం వాడుకునే స్వాతంత్ర్యం లేదు.. (మన గ్యాస్ ని గద్దలా తన్నుకు పోదామని ప్రయత్నించినపుడు  పెట్రోలియం శాఖ  మంత్రి  మన  వాడే!)  ప్రజల బాగోగులు చూడటం ఏనాడో మరచి పోయి, అధికారం కాపాడుకోవటం కోసం అధిష్టానం ముందు సాగిల పడటమే ఇప్పుడు తెలుగు వాడికి తెలిసింది... కేంద్రం మిధ్య అంటూ డిల్లీ దాష్టీకానికి ఎదురొడ్డి నిలిచిన ఎన్ టీ ఆర్ తోనే తెలుగు వాడి పౌరుషం కూడా చచ్చి పోయింది.  కేవలం రాజకీయ నాయకుల పదవులు పెంచుకోవటం కోసం ప్రత్యెక రాష్ట్రం కావాలంటూ అర్ధం పర్ధం లేని ఆందోళనలు చేస్తూ మన అనైక్యతని పొరుగు రాష్ట్రాల వారికి, కేంద్రానికి చాటి చెప్పాం.  దాని ఫలితం గానే ఇంత లోకువ అయ్యాము.  భారత దేశంలో ఏ ఇతర రాష్ట్రంలో చూసినా, అక్కడి రాజకీయ నాయకులు అధికారంలో వున్నా, ప్రతి పక్షంలో వున్నా కూడా తమ సొంత రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకున్నాకే తమ స్వార్ధం చూసుకుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఒక పక్క ప్రజలు కరెంటు లేక, నీళ్ళు లేక, ఇతర సౌకర్యాలు లేక అలమటిస్తుంటే..కేవలం అధికారం కాపాడుకోవటం కోసం దేశ రాజధాని చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్న ఘనులు మన తెలుగు వారు!  మనలో ఈ అనైక్యత కొన సాగినంత కాలం రాష్ట్ర అభివృద్ది సున్నా అనటంలో ఏ మాత్రం సందేహం లేదు..