Friday, March 18, 2011

ఆంధ్రావనికి ద్రోహం చేస్తున్న జగన్...

మాట  తప్పని, మడమ తిప్పని వంశానికి చెందిన వాడినని చెప్పుకొనే జగన్ మాట తప్పుతున్నట్లే కనిపిస్తోంది. శాంతి స్వరూపుడైన బుద్ధుని విగ్రహాలని నాశనం చేసిన తాలిబాన్ల లాగ తెలుగు జాతి ఘన చరిత్రకి సంకేతాలైన టాంక్ బండ్ మీది విగ్రహాలని ద్వంసం చేసిన తెలబాన్లని జగన్ కించిత్తు విమర్శించక పోవటం ఆశ్చర్యకరం. కాంగ్రెస్ పార్టీలో వున్నప్పుడు పార్లమెంటు సాక్షిగా రాష్ట్ర విభజనకి తాను వ్యతిరేకమని స్పష్టం చేసిన జగన్ ఇప్పుడు సొంత పార్టీ పెట్టాక తన విధానం ప్రకటించక పోవటం శోచనీయం.
( పైన వీడియో చూడండి)  భాగస్వామ్య పక్షాల అంగీకారం తీసుకోకుండా తొందరపాటుతో డిసెంబర్ 9 ప్రకటన చేసిన కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే అవకాశాన్ని పార్టీనుండి బయటకి వచ్చాక జగన్ ఎందుకు సద్వినియోగం చేసుకోవట్లేదు? ఎటూ తేల్చకుండా నాన బెట్టబట్టే తెలంగాణా సమస్య ఈ రోజు కోతి పుండు బ్రహ్మ రాక్షసి అన్నట్లు తయారయింది. ఈ సంగతి తెలిసి కూడా సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రం తగలబడి పోతున్నా నిమ్మకి నీరెత్తినట్లున్న కాంగ్రెస్, టీడీపీ ల కి పోటీగా తాను కూడా వ్యూహాత్మక మౌనం పాటించటం నేరమే. వైఎస్ పధకాలన్నీ అమలు చేస్తానని డబ్బా కొడుతున్న జగన్, తండ్రి విశ్వసించిన సమైక్య వాదాన్ని ఎందుకు పాటిన్చట్లేదు? రాజ శేఖర రెడ్డి తరచుగా వాడిన పదం "విశ్వసనీయత". కేవలం పదవి కోసమే రాజకీయాలు చేసి ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన నాడు జగన్ రాజకీయ భవిష్యత్తు అంధకారమే అవక తప్పదు.

Saturday, March 12, 2011

పిచ్చి ముదిరిన కోదండ రాం!

అసలు పోలీస్ పర్మిషన్ లేకుండా మిలియన్ మార్చ్ వంటి కార్యక్రమాన్ని నిర్వహించడమే పెద్ద తప్పు. తాము అనుమతించని కార్యక్రమాన్ని నిర్వహించి- తెలుగు జాతి పరువు పోయేలా జరిగిన విధ్వంస కాండకి నేరుగా బాధ్యత వహించాల్సిన కోదండ రాంని తక్షణం శిక్షించాల్సిన పోలీసులు మీన మేషాలు ఎందుకు లెక్క పెడుతున్నారో తెలీదు.అందునా ఆ కార్యక్రమంలో జరిగిన విధ్వంసానికి బాధ్యత వహించటం కానీ,లేదా పశ్చాత్తాపం వ్యక్తం చేయక పోవటం ముదిరిన ఆయన అహంకారానికి నిదర్శనం. మొక్కుబడిగా మీడియాకి క్షమాపణ చెప్పేస్తే చేసిన పాపం ప్రక్షాళన అవదు. తన మీద చర్య తీసుకోక పోవటం అలుసుగా తీసుకొనే ఈ రోజు ఆయన మళ్ళీ పైత్యాన్ని వెళ్ళ గక్కారు. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ చచ్చి పోయిందనీ,త్వరలో కర్మ కాండలు నిర్వహిస్తామనీ సెలవిచ్చారు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు ప్రాంతాల ప్రజలనుండి వసూలైన పన్నులనుండి జీతం తీసుకుంటూ ఆంద్ర ప్రదేశ్ శాసన సభ పైనే ఇటువంటి దురహంకార వ్యాఖ్యలు చేయడం ఎంత మాత్రం సహించకూడదు. ప్రభుత్వం ఇప్పుడు ఆయన పై చర్య తీసుకోవడానికి రెండు అవకాశాలున్నాయి.
ఒకటి- ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వ వ్యతిరేక వ్యాఖ్యలు, చర్యలు చేస్తున్నందుకు కఠినంగా శిక్షించడం...
అంత చేవ, తెగువ లేక పొతే...
రెండు- కోదండ రాంని ఎర్ర గడ్డ పిచ్చాసుపత్రిలో చేర్చి, పిచ్చి వాడి మాటలకి విలువ లేదని ప్రకటించడం..

Thursday, March 10, 2011

తెలబాన్లను క్షమించకూడదు..

ఉద్యమం కాదు అది వున్మాదమే!
వేర్పాటు వాదం కాదు అది తీవ్ర వాదమే..
తెలబాన్ అక్రుత్యాలకి అంతు లేదా?
అరాచకత్వానికి అంతం ఎప్పుడు?
వేర్పాటు వాదులకి బుద్ది చెప్పాలి!
వెర్రి తలలు వేస్తున్న వేర్పాటు వాదం..
హద్దు మీరుతున్న తెలంగాణా ఉద్యమం..

ఇవన్నీ నేను ఇంతకు ముందు రాసిన టపాల  టైటిల్స్.. అన్నీకూడా అక్షర సత్యాలని ఈ రోజు తెలబాన్ గుంపులు నిరూపించాయి. తెలుగు వారి చరిత్రకి ప్రతిబింబాలైన మహనీయుల విగ్రహాలని అత్యంత దుర్మార్గంగా ద్వంసం చేయడమన్నది తెలబాన్ల పైత్యానికి పరాకాష్ట!   అమర జీవి పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని ద్వంసం చేసిన రోజే ప్రభుత్వం మేలుకొని వుంటే పరిస్థితి ఇంత దాకా వచ్చేది కాదు. పైగా విగ్రహాలు పొతే మళ్ళీ వస్తాయి అంటూ పిల్ల తెలబాన్ నాయకుడు చేసిన వ్యాఖ్య క్షంతవ్యం కానే కాదు. నాశనమైనవి వట్టి విగ్రహాలే కాదు.. మొత్తం తెలుగు జాతి పరువు ప్రతిష్టలు కూడా నేడు హుస్సేన్ సాగర్ జలాల్లో కలిసి పోయాయి. రాజధాని నడి బొడ్డున ఇంత అరాచకం జరిగాక ప్రభుత్వం ఇంకా చేతులు ముడుచుకొని కూర్చోవటానికి వీల్లేదు. ముల్లుని ముల్లుతోనే తీయాలి. అరాచకత్వానికి ఆయుధంతోనే సమాధానం చెప్పాలి. మరో ఆపరేషన్ బ్లూ స్టార్ నిర్వహించి పైత్యం ప్రకోపించిన వేర్పాటు వాదాన్ని కూకటి వేళ్ళతో పెకలించాలి.

Tuesday, March 8, 2011

బెల్టు తీసిన పోలీస్-తోక ముడిచిన కోదండ రాం!

హైదరాబాదుని దిగ్బందిస్తాం..
ప్రపంచ చరిత్రలో ఇటువంటి ఆందోళన జరగలేదు., జరగ బోదు...
పోలీస్ పర్మిషన్ తీసుకొం..
ఉద్యమం చూసి ప్రభుత్వం ఇంటర్ పరీక్ష వాయిదా వెయ్యాలి...
కేంద్రాన్ని గడ గడలాడిస్తాం...
ఇలా ఒకటా రెండా? ఎన్నెన్ని ప్రేలాపనలు! ప్రభుత్వమంటే లెక్కే లేనట్లు..తన కను సన్నల్లో పరీక్షలు జరగాలన్నట్లు..కోదండ రాం హుంకరించారు.  కానీ చివరికి ఏం జరిగింది? పిల్లల పరిక్షల విషయమై వెల్లువెత్తిన ప్రజాగ్రహంతో పాటు ఆంక్షల కొరడా ఝుళిపించిన పోలీస్ దెబ్బకి కోదండ రాం తోక ముడవక తప్పలేదు. మిలియన్ మార్చి సమయాన్ని మూడు గంటలకు, స్థలాన్ని టాంకు బండుకి పరిమితం చేసుకోవాల్సి వచ్చింది.  ఇప్పటికైనా వాపుని చూసి బలుపనుకొని భ్రమ పడే వేర్పాటు (తీవ్ర) వాద గుంపులకి ఈ పరిణామం కనువిప్పు కావాలి.

Sunday, March 6, 2011

తెలంగాణా ఉద్యమం వెనుక ఉన్న అసలు కద!

(నా బ్లాగులో ముందరి టపాలో LBSతాడేపల్లి గారి కామెంట్ యదా తధంగా )


తెలంగాణ ఉద్యమం అనేది తెలుగుదేశం పార్టీని డౌన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ నుంచీ తెఱ వెనక ఉండి డబ్బులిచ్చి మఱీ కృత్రిమంగా నడిపిస్తున్న వ్యూహాత్మక ఉద్యమమని తెలంగాణ అమాయకులకు తెలియదు. తెలియక, అదేదో తమవాళ్ళ ప్రతిభ, సృజనాత్మకత, పౌరుషం అనుకుని ఇంకా ఎక్కువెక్కువ లొల్లి చేస్తే భయపడి రాష్ట్రం ఇచ్చేస్తారనుకొని తెలంగాణకి అక్షరాలా నిప్పెట్టేస్తున్నారు. కేసీయార్ గర్జనలన్నీ నిజమనుకుంటున్నారు. మిహతా రాష్ట్రమంతా ఆనందంగా గడిపేస్తూండగా తెలంగాణ ఒక్కటీ ఒక తప్పుడు మిథ్యా ఉద్యమం పేరుతో నిలువునా తగలబడిపోతోంది. అందఱూ కలిసి దీన్ని ఎలాగైనా ఆపాలి !


తెలంగాణ సోదరులారా !

మీరు వట్ఠి అమాయకులు

కాంగ్రెస్ రాజకీయం తెలియని పిచ్చోళ్ళు

ఉద్యమం రేపెట్టింది వాళ్ళు

తాము వెనకుండి కేసీయార్ ని ముందుకు తోసింది వాళ్ళు

కేసీయార్ కి తెలంగాణ భవన్ ఇచ్చింది వాళ్ళు

అతన్ని గెలిపించింది వాళ్ళు

ఎవళ్ళు ? బాబూ ! ఇంకెవళ్ళు మన కాంగ్రేసోళ్ళు

కేసీయార్ కి డబ్బులు దొబ్బబెట్టింది వాళ్ళు

అతని చేత నిరాహారదీక్ష చేయించింది వాళ్ళు

విరమింపజేసింది వాళ్ళు

ఉద్యమం చేయించింది వాళ్ళు

ఎవళ్ళు ? బాబూ ! ఇంకెవళ్ళు మన కాంగ్రేసోళ్ళు

సహాయనిరాకరణ చేయించింది వాళ్ళు

నిరాకరణ విరమణ చేయించింది వాళ్ళు

మిలియన్ మార్చ్ చేయిస్తున్నది వాళ్ళు

ఇస్తామన్నది వాళ్ళు, వెనక్కు తీసుకున్నది వాళ్ళు

ఎవళ్ళు ? బాబూ ! ఇంకెవళ్ళు మన కాంగ్రేసోళ్ళు

ఇహనైనా కళ్ళు తెఱవండి ! విషయాలు గ్రహించండి !

రాని రాష్ట్రం కోసం అన్నదమ్ముల్లాంటి

ఆంధ్రావాళ్ళతో అనవసరంగా గొడవపడకండి !

ఢిల్లీ కాంగ్రెస్ కుటిల రాజకీయాలకు

కరాళంగా బలికాకండి !

ఇతరులని బలి చేయకండి !



మీరు సమైక్యవాదుల్ని అమ్మనా బూతులు తిట్టినా ఫర్వాలేదు గానీ మీ నిజాన్ని గ్రహించి మీ యీ ప్రవర్తనకు సిగ్గుపడే రోజు తప్పకుండా వస్తుంది. చాలా తొందఱగానే రాబోతోంది.

( LBSతాడేపల్లి గారికి కృతజ్ఞతలు )

Saturday, March 5, 2011

తెలంగాణా ఇవ్వబోమని తేల్చేసిన కాంగ్రెస్!

"తెలంగాణా కి ఒకే అంటే సోనియా కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తిన జల్లుకుంటా..- 26 డిసెంబర్,2010  న కే.సి.ఆర్."==  ఇటలీ దేవత ముందు ఇంతలా సాగిల పడ్డా ఉపయోగం లేదు.  
మహా గర్జన పేరుతొ వింత మొరుగుళ్ళు మొరిగినా లెక్క చేయలేదు.
తాము తెర వెనుక ఉంటూ తెర ముందుకు జై బోలో తెలంగాణా తెచ్చినా వర్కవుట్ అవలేదు.
సహాయ నిరాకరణ అంటూ ఉద్యోగులని ఎగ దోసినా ఉపయోగం లేదు.

"పల్లె పట్టాల పైకి"  అంటూ రైలు పట్టాల మీద కాపురం చేయించినా పట్టించుకోనేలేదు.
నోటికి నల్ల బెండేజీలు కట్టుకొని పార్లమెంటులో తిరిగినా,అదే పార్లమెంటులో తెలబాన్ చెల్లి వల వలా ఏడ్చినా కూడా చలించలేదు.
ఇటువంటి టక్కు టమార గారడీ విద్యలు ఎన్ని ప్రదర్శించినా కూడా తెలంగాణా ఇచ్చేది లేదని కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది. పార్టీ కేంద్ర కార్యవర్గం నుండి తెలంగాణా వాదుల్ని సాగనంపి వారంటే లెక్కే లేదన్న విధంగా నియామకాలు చేసింది.  పదవుల్ని వదిలి గంట కూడా వుండలేరన్న కావూరి మాటల్లోని సత్యం కాంగ్రెస్ అధిష్టానానికి స్పష్టమయింది. అందుకే డోంట్ కేర్ అన్నట్లు తెలంగాణా వాదుల్నీ, వాదనల్నీ పక్కన పెట్టేసి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఏర్పాట్లలో మునిగి పోయింది. మరి ఇంకా ఎందుకు అనవసర ఆందోళనలూ,విధ్వంసాలు, మిలియన్ మార్చి పేరుతొ విద్యార్ధుల జీవితాలతో చెలగాటాలు! ఇక ఎంత మాత్రం సాగనివ్వకూడదు. అనవసర ఆందోళనల కోసం విద్యార్ధుల పరీక్షలు బలి కాకూడదు.

Friday, March 4, 2011

విద్యార్ధుల భవిష్యత్ దిగ్బంధనం!

మిలియన్ మార్చ్ పేరుతొ పదవ తేదీన తెలబాన్ గుంపులు తల పెట్టింది భాగ్య నగర దిగ్బంధనం కాదు..వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్ దిగ్బంధనం. ఇంటర్ పరీక్షలతో పాటు విద్యార్ధి భవిష్యత్తుకి కీలకమైన పదవ తరగతి పరీక్షలు జరుగనున్న పదవ తేదీన తల పెట్టిన మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే నిషేధించాలి. తెలంగాణా ఆకాంక్షని తెలియ చేయడానికన్న వంకతో  టెన్త్ క్లాస్ విద్యార్ధుల భవిష్యత్తుతో ఆటలాడటం క్షమించరాని నేరం. పైగా తాము ఉద్యమం తల పెట్టామని  పరీక్షలు వాయిదా వేయాలంటూ  ప్రభుత్వానికి హుకుం జారీ చేయటం తెలబాన్ల దురహంకారానికి నిలువెత్తు నిదర్శనం. జాతీయ స్థాయిలో జరుగుతున్న సి.బీ.ఎస్.ఈ. పదవ తరగతి పరీక్షలు కేవలం ఒక రాష్ట్రంలోని కొంత ప్రాంతంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల వాయిదా వేయరన్న ఇంగిత జ్ఞానంకూడా లేకుండా విద్యా రంగంలోనే ఉన్న ఒక మూర్ఖ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో తల పెట్టిన ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. ఏడాది అంతా కష్ట పడి చదివి ఈ రోజు పరీక్ష రాయ గలమో లేదో అన్న టెన్షన్ లో విద్యార్దులనీ, పిల్లల భవిష్యత్ గురించిన మానసిక వేదనతో వారి తల్లి దండ్రులని వేధిస్తున్న మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని అడ్డుకొనే తెగువ ప్రభుత్వానికి లేక పొతే తక్షణం రాష్ట్రపతి పాలన విధించి ప్రశాంత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత  కేంద్ర ప్రభుత్వానికి వుంది.

Wednesday, March 2, 2011

మూర్ఖ తెలం"గానం" !

పాడిందే పాటరా పాచి పళ్ళ దాసుడా అన్నట్లు తెలబాన్ వీరులకు ఎంత సేపూ చిదంబరం గారి డిసెంబరు 9వ తేదీ ప్రకటన తప్ప మరేమీ పట్టనట్లు వుంది. ఏ హోదాలో డిసెంబరు 9వ తేదీ ప్రకటన చేసారో అదే కేంద్ర హోమ్ మంత్రి హోదాలో డిసెంబర్ 23వ తేదీ మరో ప్రకటన చేసిన విషయం వారి పీత బుర్రలకి పట్టదా? మళ్ళీ అదే చిదంబరం తాజాగా - రాత్రికి రాత్రి తెలంగాణా రావడం కష్టం అని స్పష్టం చేస్తే ఇన్నాళ్ళూ దేవుడిలా కనిపించిన చిదంబరం దెబ్బకి దెయ్యమై పోయాడు! అలాగే  న్యాయ శాస్త్రం చదివిన న్యాయవాదులు వీధి రౌడీల మాదిరి హైదరాబాదులోని ఎంపీ కావూరి సాంబశివ రావు ఇంటి మీదకి దాడికి వెళ్ళడం మరీ హాస్యాస్పదం. అసలు కావూరి చెప్పిన దాంట్లో తప్పు ఏముంది? తన ఇంటి మీద దాడి చేస్తే తెలంగాణా రాదు...ఆ ప్రాంత ఎంపీలు రాజీనామా చేస్తే వస్తుందని ఆయన అన్నారు. ఎంత సేపూ తమ పదవులని అంటి పెట్టుకుని ఉంటూ ఉద్యమం పేరుతొ ప్రజలని ఇక్కట్ల పాలు చేయటమే తెలబాన్ నాయకులకి తెలిసిన విద్య. ఇతర పక్షాల వారిని రాజీనామా చేయమని బావురు కప్పల్లా అరవడమే తప్ప తమ రాజీనామాని సరైన ఫార్మాట్లో ఇవ్వటం వారికి ఈ రోజుకీ తెలియని విద్య! అలాగే సినీ కళా కారులని వేధించటం తెలబాన్లకి వెన్నతో పెట్టిన విద్య అన్న విషయం నాటి అదుర్స్ సినిమా యూనిట్ వారినుంచి నేటి అల్లరి నరేష్ సినిమా యూనిట్ వారిని ఎవ్వరిని అడిగినా కధలు కధలుగా చెప్తారు. తాను పుట్టింది తెలంగాణా ప్రాంతమైనా ఏనాడో నలభై ఏళ్ల క్రితమే "తెలుగు జాతి మనది-నిండుగ వెలుగు జాతి మనది" అని సమైక్య రాగాన్ని వినిపించిన పెద్ద మనిషి డా. సి.నారాయణ రెడ్డి ఈ రోజు జై తెలంగాణా అన్నారంటే -- కళాకారులని సైతం తెలబాన్లు ఏ రేంజిలో వేధించారో తేట తెల్లమవుతోంది.వెర్రి కుదిరింది రోకలి తలకి చుట్టమన్నట్లు అన్న చందాన తెలబాన్ల ఆగడాలు రోజు రోజుకీ శృతి మించి రాగాన పడుతున్నాయి.  ఈ ఆగడాలకీ, అఘాయిత్యాలకీ తక్షణం ఫుల్ స్టాప్ పెట్టాలి. తెలంగాణా ప్రాంతంలోని సామాన్య ప్రజలని తెలబాన్ కబంధ హస్తాలనుండి విముక్తి కలిగించాలి. ప్రశాంతంగా జీవించే హక్కుని కాల రాస్తున్న తెలబాన్ నాయకులని సాంఘిక బహిష్కరణ చేయాలి. మిలియన్ మార్చ్ పేరుతొ మళ్ళీ ప్రజలని ఇక్కట్లపాలు చేయాలన్న వారి దుష్ట పన్నాగాన్ని కేంద్రం నిలువరించాలి.