Friday, March 4, 2011

విద్యార్ధుల భవిష్యత్ దిగ్బంధనం!

మిలియన్ మార్చ్ పేరుతొ పదవ తేదీన తెలబాన్ గుంపులు తల పెట్టింది భాగ్య నగర దిగ్బంధనం కాదు..వేలాది మంది విద్యార్ధుల భవిష్యత్ దిగ్బంధనం. ఇంటర్ పరీక్షలతో పాటు విద్యార్ధి భవిష్యత్తుకి కీలకమైన పదవ తరగతి పరీక్షలు జరుగనున్న పదవ తేదీన తల పెట్టిన మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని ప్రభుత్వం వెంటనే నిషేధించాలి. తెలంగాణా ఆకాంక్షని తెలియ చేయడానికన్న వంకతో  టెన్త్ క్లాస్ విద్యార్ధుల భవిష్యత్తుతో ఆటలాడటం క్షమించరాని నేరం. పైగా తాము ఉద్యమం తల పెట్టామని  పరీక్షలు వాయిదా వేయాలంటూ  ప్రభుత్వానికి హుకుం జారీ చేయటం తెలబాన్ల దురహంకారానికి నిలువెత్తు నిదర్శనం. జాతీయ స్థాయిలో జరుగుతున్న సి.బీ.ఎస్.ఈ. పదవ తరగతి పరీక్షలు కేవలం ఒక రాష్ట్రంలోని కొంత ప్రాంతంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల వాయిదా వేయరన్న ఇంగిత జ్ఞానంకూడా లేకుండా విద్యా రంగంలోనే ఉన్న ఒక మూర్ఖ ప్రొఫెసర్ ఆధ్వర్యంలో తల పెట్టిన ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదు. ఏడాది అంతా కష్ట పడి చదివి ఈ రోజు పరీక్ష రాయ గలమో లేదో అన్న టెన్షన్ లో విద్యార్దులనీ, పిల్లల భవిష్యత్ గురించిన మానసిక వేదనతో వారి తల్లి దండ్రులని వేధిస్తున్న మిలియన్ మార్చ్ కార్యక్రమాన్ని అడ్డుకొనే తెగువ ప్రభుత్వానికి లేక పొతే తక్షణం రాష్ట్రపతి పాలన విధించి ప్రశాంత వాతావరణం కల్పించాల్సిన బాధ్యత  కేంద్ర ప్రభుత్వానికి వుంది.

4 comments:

  1. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని విరమించిన నేపథ్యంలో ఈ నెల పదవ తేదీన తలపెట్టిన ‘చలో హైదరాబాద్’ ఆందోళనను వాయిదా వేయాలని తెలంగాణ రాజకీయ జేఏసీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. పరీక్షలు పూర్తయిన తర్వాత విద్యార్థులతో ‘చలో సెక్రటేరియట్’ నిర్వహించాలనే దిశగా ఆలోచిస్తున్నట్లు సమాచారం.

    neevu chaala later raamanna.. ekkado aaksamulo untaavu.. ikkada jarigedhi emi telusu..

    ika tapa museyi..

    ReplyDelete
  2. @ above annon, ఎంతైనా తెలబాను దొర కు కాల్మొక్కటానికి మీ అంత దగ్గరా అందరూ ఉండలేరుగా, కాబట్టి కాస్త లేటే లే :)

    ReplyDelete
  3. ade.. neevu daggara lekunna mee ajaakarulu kallumokkadaaniki maa daggare untamantunnaru.. vallaku kuda chepparaadhu.. aa dorala kallaki dhoorangaa pommani..

    aa ajaakarilith memu pomu mee kalla daggare maa brathuku ani kaallu pattukoni edusthunnaru.....

    ReplyDelete
  4. ఈ క్షణం వరకు ఉన్న సమాచారం ప్రకారం ...ఇంటర్ పరీక్ష వాయిదాకి ప్రభుత్వం ఆలోచిస్తున్నదని తప్ప పదవ తేదీ దిగ్బంధన కార్యక్రమాన్ని మూర్ఖ తెలబాన్లు వాయిదా వేసినట్లు లేదు. నా ఆక్షేపణ కూడా అదే. తెలబాన్ బెదిరింపులకి లొంగి పరీక్షలు వాయిదా వేయటం అన్నది ప్రభుత్వం చేతకాని తనం. అలాగే ఆంధ్ర ప్రదేశ్ పౌరులందరూ కూడా తమ రాజధానిలో సగర్వంగా వున్నారు తప్ప ఎవరి కాళ్ళ దగ్గరో లేదా ఎవరి దయా దాక్షిణ్యాల మీద ఆధార పడి లేరన్న విషయం మూర్ఖ తెలబాన్లు గుర్తుంచుకోవాలి.

    ReplyDelete