Sunday, October 28, 2012

బ్రాహ్మణులని అపహాస్యం చేయటానికి "దేనికైనా రెడీ"

ఉత్తర భారత దేశంలో సర్దార్జీ ల పై ఎన్ని జోకులు, సెటైర్లూ వున్నాయో, దక్షిణ భారతంలో బ్రాహ్మణుల పై  అన్నే వున్నాయి. అయితే హాస్యం హద్దులు దాటనంత వరకు ఆస్వాదించి ఆనందించ వచ్చు కానీ అప హాస్యం స్థాయికి చేరితే వికటిస్తుంది.  వరుస ఫ్లాపులతో కొట్టు మిట్టాడుతున్న తన కొడుకు విష్ణు తో మోహన్ బాబు తీసిన "దేనికైనా రెడీ" సినిమా విషయంలో ఇదే జరిగింది..అసలు ఈ సినిమా దర్శకుడు నాగేశ్వర్ రెడ్డి గతంలో తీసిన "సీమ శాస్త్రి"  కూడా బ్రాహ్మణ వర్గం పై పైత్యం వెళ్ల గక్కినా, ప్రేక్షకులు ఆదరించారు. దాంతో ఆ పైత్యం ఇంకా ముదిరి మోహన్ బాబు తో కలిసి దేనికైనా రెడీ అంటూ ప్రేక్షకుల ముందుకి వచ్చాడు.  ఇటువంటి వికృత హాస్యం తో కూడిన సినిమాకి సెన్సార్ సమస్య రావటంలో ఆశ్చర్యమేమీ లేదు! ఇంకా సెన్సార్ అధికారిణి దయతో చేసిన కటింగుల వల్ల ఆ వికృత హాస్యానికి కొంతైనా బ్రేక్ పడింది.. కానీ సెన్సార్ బోర్డు పై నానా రభస చేసి, సెన్సారు అధికారిణి ధనలక్ష్మి ని నానా దుర్భాషలాడి, సెన్సారు సర్టిఫికేట్ మోహన్ బాబు పొందటం చూస్తె నోరు గల వాడిదే రాజ్యం అని తేలుతోంది..సెన్సారు బోర్డు ఆమోదించి సర్టిఫికేట్ ఇచ్చాక, కెమెరామన్ గంగ తో రాంబాబు చిత్రం విషయంలో తెలబాన్లు ప్రతిపాదించిన అర్ధం పర్ధం లేని కటింగులని చిత్రం నుండి తొలగించటం కూడా వారి నోటికి జడిసే అన్నది సత్యం...అయినా ఏనాడో తన అసెంబ్లీ రౌడీ చిత్రం లోనే పంతులూ పంతులూ పావు శేరు మెంతులూ అంటూ బ్రాహ్మణులని వెటకారం చేసే పాట పెట్టిన మోహన్ బాబు నించి ఇంతకంటే గొప్ప కళా ఖండం ఆశించటం అవివేకం... "వినాశ కాలే విపరీత బుధ్ధి"....

Friday, October 19, 2012

తెలబాన్ ఆగడాలు ఇంకెన్నాళ్ళు?

తెలంగాణా మార్చ్ హంగామా ఘోరంగా విఫలమయ్యాక తెలబాన్ల కన్ను ప్రస్తుతం పూరీ జగన్నాధ్ సినిమా పై పడింది.  తాజాగా విడుదలైన "కెమరామన్ గంగ తో రాంబాబు" చిత్రం  లో  తెలంగాణా వ్యతిరేక సన్నివేశాలు వున్నాయంటూ దర్శకుని కార్యాలయం ద్వంసం చేసారు. ఆ సినిమా తెలంగాణలో ఆడనివ్వమని హెచ్చరికలు చేసారు.  ఇంకా దర్శకుడు క్షమాపణ చెప్పాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసారు.   ఇక్కడ ఒక విషయం గమనించాలి. అసలు చలన చిత్రాలకి ప్రభుత్వం నియమించిన సెన్సార్ బోర్డు ఎందుకు వుంది? ఒక చిత్రాన్ని విడుదలకి ముందే బోర్డు నిర్ణయించిన సభ్యుల బృందం నిశితంగా పరిశీలించి ఆ చిత్రం లో అశ్లీలకర, అభ్యంతరకర సన్నివేశాలు లేవని సంతృప్తి చెందాకే సర్టిఫికేట్ జారీ చేస్తారు. సెన్సార్ స్వయంగా సర్టిఫికేట్ ఇచ్చాక మళ్ళీ ఈ తెలబాన్ల సెన్సారింగ్ ఏమిటి?   గతం లో కూడా తెలబాన్లు చాల చిత్రాల పై అనవసర హంగామా చేసి అడ్డుకున్న చరిత్ర వుంది. వారి వసూళ్ళ కోసమే ఈ హంగామాలు అన్నది బహిరంగ రహస్యం. తెలుగు సినిమాల పాలిట శాపంగా ఈ తెలబాన్ ఉద్యమం పరిణమించింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సీమాంధ్రులని దుమ్మెత్తి పోస్తూ "జై బోలో తెలంగాణా" వంటి చిత్రాన్ని తీసినా... ఇంకా ఆ వేర్పాటు వాద చిత్రానికి "జాతీయ సమైక్యతా" బహుమతి ఇచ్చినా కూడా సీమాంధ్రులు నోరు మెదపకుండా విజ్ఞత చూపించారు.  ఇక ఈ సినిమాలో తెలబాన్లు చెప్పిన దృశ్యాలు తొలగించినా లేదా తెలబాన్లకి భయ పడి దర్శక నిర్మాతలు క్షమాపణలు చెప్పినా అది ప్రభుత్వానికే అవమానం.  ఇకనుండైనా తెలుగు సినిమాలు తెలబాన్ల బారిన పడకుండా రక్షించాలంటే ప్రభుత్వం ముందున్నవి రెండే మార్గాలు-- ఒకటి..సెన్సారు క్లియరేన్సు సర్టిఫికేట్ ఇచ్చాక కూడా కావాలని చేసే ఇటువంటి ఆగడాలని పోలీసు చర్యల ద్వారా సమర్ధవంతంగా అణచి వేయటం....లేదా..రెండు...అంత చేవ లేకపోతె, తెలబాన్ల తో ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పాటు చేసి, ప్రతి సినిమా ముందు వాళ్లకి చూపించి, వాళ్ళు సరే అన్నాక విడుదలకి అనుమతించటం...

Wednesday, October 17, 2012

ప్రధాని తెలబాన్లకి భయపడ్డారా?

జీవ వైవిధ్య సదస్సుకి హాజరైన ప్రధాని మన్మోహన్ సింగ్ బేగం పేట విమానాశ్రయం నుండి వాయు మార్గంలో సదస్సుకి చేరి తిరిగి వాయు మార్గంలో నే తిరిగి వెళ్ళటం తమకి భయపడే అని తెలబాన్లు జబ్బలు చరుచుకుంటున్నారు.   భారత ప్రధాన మంత్రి హోదాలో ఒక ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకి హాజరయ్యే సమయంలో ఆశుద్దం మీద రాయి వేసినట్లు తెలబాన్లతో బురద జల్లించుకుంటారా?   తన హోదాకి తగ్గట్లే భద్రతా ఏర్పాట్లు చేయించుకున్నారు. రాజ మార్గంలో వచ్చి వెళ్లారు. అయినా తమని సదస్సు వద్దకి రానీయలేదనీ, తమ మీడియాని అడ్డుకున్నారనీ ఒక కంటితో వల వలా ఏడుస్తూనే మరో పక్క ప్రధాని తమకి భయ పడి పారి పోయారని బీరాలు పలకటం తెలబాన్లకే చెల్లింది!

Sunday, October 14, 2012

నందులు నవ్వి పోతున్నాయి!

 మన రాష్ట ప్రభుత్వం ఇచ్చే నంది అవార్డులకి ప్రాధాన్యత, పవిత్రత ఏనాడో గంగలో కలిసాయి. రాజకీయ కారణాల వల్లో లేదా సిఫార్సుల వల్ల మాత్రమె ఈ అవార్డులు ఇస్తున్నారన్నది నిష్టుర సత్యం.   తాజాగా 2011 సంవత్సరానికి నంది అవార్డులు ప్రకటించారు.  బాపు దర్శకత్వంలో వచ్చిన శ్రీ రామ రాజ్యం ఉత్తమ చిత్రం గా ఎంపిక గావటంలో ఎటువంటి సందేహాలకి ఆస్కారం లేదు. అయితే ఆ ఉత్తమ చిత్రానికి పనిచేసిన దర్శకుడు ఉత్తమ దర్శకుడు కాక పోవటమే వింత!    హాస్యాస్పదమైన విషయం ఏమిటంటే.... పచ్చగా, సమైక్యంగా ఉన్న రాష్ట్రాన్ని ఉత్తి పుణ్యానికి ముక్కలు చేయమనే తెలంగాణా ఉద్యమం ఆధారంగా తీసిన "జై బోలో తెలంగాణా" ఉత్తమ జాతీయ "సమైక్యతా" వాద చిత్రమట! ఆ సినిమా దర్శకుడు ఉత్తమ దర్శకుడట!  
 ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో తెలంగాణా మూలాలు కలిగిన సినిమాలకి అవార్డులు కట్టబెట్టటం వెనుక ఉన్న ఆంతర్యం చిన్న పిల్ల వాడిని అడిగినా చెప్పేస్తాడు.   జ్యూరీ సభ్యులు ఎవరి మెప్పును పొంద గోరి ఈ అవార్డులు ప్రకటించారో లేదా ఎవరి చెవుల్లో పూలు పెట్టాలనుకున్నారో అర్ధం కాదు.   ప్రైవేటు సంస్థలు ఇంకా చాలా అవార్డులు ప్రకటిస్తూ, ఇస్తూ వుంటాయి. అవి ఎవరికి, ఎందుకు ఇచ్చారన్నది మనకి అనవసరం. కానీ ప్రభుత్వ పరంగా ఇస్తున్న అవార్డుల విషయంలో వివాదాలకి తావు లేకుండా వ్యవహరించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వం విస్మరించటం శోచనీయం.  

Sunday, October 7, 2012

దసరా పండక్కి తెలంగాణా ! తెలబాన్లూ పండగ చేసుకోండి.....

మిలియన్ మార్చ్ సందర్భంగా ధ్వంసమైన విగ్రహాల స్థానంలో టాంకు బండ్ మీద తెలంగాణా వారి విగ్రహాలే పెట్టాలని తెలబాన్ బిడ్డ కవిత ఆందోళన చేసింది. మంచిదే. కానీ ఒక్క విషయం తెలబాన్ల పీత బుర్రలకి ఏ మాత్రం అర్ధం కావటంలేదు. హైదరాబాదు అన్నది సమైక్యాన్ధ్రకి రాజధాని. ఇక్కడ అన్ని ప్రాంతాల వారికీ సమాన హక్కులు వుంటాయి. భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో ఉన్నంత మాత్రాన వారి పంతమే చెల్లాలనుకోవటం మూర్ఖత్వం.
 అలాగే మధు యాష్కీ కూడా అంతే ! దమ్ముంటే సమైఖ్య ఆంధ్ర కోసమే సీమాంధ్ర ఎంపీ లు రాజీనామా చేయాలని సవాల్ విసురుతున్నారు. ప్రస్తుతానికి రాష్ట్రం సమైక్యంగానే వుంది.  ఉంటుంది........ఉత్తి పుణ్యానికి రాజీనామాల డ్రామాలాడేసి, మళ్ళీ వాళ్ళే అక్కడే గేలిచేసి,  ప్రజా ధనాన్ని వృధా చేసి పదవులు పట్టుకుని వేళ్ళాడే కుసంస్కారం తెలబాన్లదే !
 
కొస మెరుపు:
హస్తినా పురి కలుగులోంచి నెల తర్వాత బైటకి వచ్చిన పిట్టల దొర దసరాకే తెలంగాణా అని ప్రకటించేసాడు. సీమాన్ధ్రులు రాజధాని కోసం కూడా వెతుకుతున్నారుట !
 
  ఇంత హంగామా జరుగుతుంటే వాయలార్ రవి వేరీజ్ తెలంగాణా అని అడుగుతాడా?   అయినా కచరా స్వయంగా ప్రకటించేసాక ఇంక ఈ వాయలార్ రవి వంటి వాళ్ళూ, కేంద్రం ఏమనుకున్నా లెక్క లేదు. తెలబాన్లూ దసరా సంబరాలు మొదలు పెట్టుకోండి...

Monday, October 1, 2012

తొండ ముదిరిన తెలబాన్ తీవ్ర వాదం..


అంతర్జాతీయ జీవ వైవిధ్య సదస్సు వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమం మరొక్క రోజులో వుండగా తెలంగాణా మార్చ్ కి అనుమతి ఇవ్వటం ప్రభుత్వం చేసిన పెద్ద తప్పు. తెలంగాణా ప్రాంత మంత్రుల ఒత్తిడికి తలొగ్గి తాను చేసిన తప్పుకి రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యాన్నే చెల్లించుకోవలసి వచ్చింది. అంతే కాదు, అంతర్జాతీయ ప్రతినిధుల ముందు మొహం చెల్లని పరిస్థితి కూడా దాపురించింది.  చిత్తు కాగితాల్లాంటి హామీ పత్రాల్ని తీసుకుని మార్చ్ కి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, ఈ రోజు జరిగిన విధ్వంసానికి బాధ్యత ఎవరి మీద వేస్తుంది? నెక్లెస్ రోడ్ రైల్వే స్టేషన్, జల విహార్ ప్రాంతాల్లో జరిగిన ఆస్తి నష్టం ఎవరి జీతాల్లోంచి వసూలు  చేస్తుంది?   అనుమతి కోసం దేబిరించిన తెలంగాణా మంత్రుల జీతాలనుండా లేక అప్పనంగా జీతం తీసుకుంటూ ఉద్యమం లో తిరుగుతున్న కోదండ రాం నుంచా?  
వెన్నెముక లేని ప్రభుత్వం కవాతు కి అనుమతి ఇవ్వటంతోనే తమ అసలు రంగుని తెలబాన్లు బయట పెట్టారు. తెలంగాణకి రోడ్ మాప్ ఇవ్వందే కదిలేది లేదని భీష్మించుకు కూర్చున్న తెలబాన్ గుంపులని ప్రభుత్వం తరిమి కొట్టలేక పోయినా, వరుణ దేవుడు తరిమి కొట్టాడు.  అనుమతించిన సమయం దాటినా కూడా తెలబాన్ గుంపులు కదలక పోవటంతోనే సీమాంధ్ర ప్రాంతాల్లో అలజడులు మొదలై పోయాయి. మానవ హారాలు, పోటీ కవాతులు జరిగాయి. రాష్ట్రం మళ్ళీ కల్లోలం దిశగా పయనిస్తోంది. ఇంక ఎంత మాత్రం ఉపేక్షించటానికి వీల్లేదు. తెలంగాణా ఉద్యమం అన్నది ఉన్మాద స్థాయిని దాటింది.... వేర్పాటు వాదం తీవ్ర వాద హద్దులు చేరింది.... మరో బ్లూ స్టార్ ఆపరేషన్ వంటిది నిర్వహించి వేర్పాటు (తీవ్ర) వాదాన్ని ఉక్కు పాదంతో అణచి వేయందే మన రాష్ట్రానికి ప్రశాంతత వుండదు...అభివృద్ది అన్నది దరి చేరదు. అంత వరకూ ఎటువంటి అంతర్జాతీయ సదస్సులూ, సమ్మేళనాలూ నెత్తినెత్తుకోకుండా వుంటే మన పరువు కొంతైనా నిలబడుతుంది...