Tuesday, April 30, 2013

శభాష్ సీ ఎం !

ఎట్టకేలకు ముఖ్య మంత్రి గారు చేవ చూపించారు. విశాఖ ఉక్కు కర్మాగారానికి బయ్యారం గనుల కేటాయింపు పై మడమ తిప్పేది లేదని కుండ బద్దలు కొట్టారు. తెలబాన్ నాయకుని తాటాకు చప్పుళ్ళకు బెదిరేది లేదని తేల్చి చెప్పారు!  

విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు అంటూ కేంద్రంతో పోరాడి సాధించిన విశాఖ ఉక్కు కర్మాగారం కేవలం విశాఖ ప్రాంతానికో లేదా సీమాంధ్రులకో మాత్రమె చెందదు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మొత్తానికీ చెందుతుంది. ఆ మాటకొస్తే దాని ఉత్పాదనా ఫలాలను దేశం మొత్తం అనుభవిస్తోంది.  ఈ పాటి ఇంగిత జ్ఞానం లోపించి -- భౌగోళికంగా తెలంగాణా ప్రాంతంలో వున్న బయ్యారం గనులను విశాఖ ఉక్కు కి కేటాయించడం అడ్డుకుంటామంటూ రంకెలేస్తున్న తెలబాన్ నాయకుడిని ఖాతరు చేసేది లేదని ముఖ్య మంత్రి  తేల్చి చెప్పటం ముదావహం. ఇటువంటి కఠిన వైఖరినే - సీమాంధ్రులని తరిమి కొడతాం .. నాలుకలు కోస్తాం అని తెలబాన్లు అన్న రోజునించి అవలంబించి ఉండి వుంటే ... ఉద్యమం అనేది ఉన్మాద స్థాయికి చేరేది కాదు. మన రాష్ట్రం అభివృద్ధిలో దశాబ్దాల వెనక్కి వెళ్లేదీ   కాదు...

Saturday, April 27, 2013

రమణాచారి గారు! మీ నిర్ణయం అసమంజసం !!


 అఖిల భారత సర్వీసుకి చెందిన ఉత్తమ అధికారి ఆయన! తిరుమల తిరుపతి దేవస్థానం కార్య నిర్వహణాధికారిగా ఆయన అందించిన సేవలు తెలుగు ప్రజలు ఎప్పటికీ గుర్తు ఉంచుకుంటారు . తెలుగు భాష లో ఆయనకు వున్న పాండిత్యం కూడా మెచ్చ తగింది . ఇంతటి విద్వత్తు వున్న రమణాచారి గారు ఎత్తెత్తి పేడలో కాలు వేసిన చందంగా వేర్పాటువాద ప్రాంతీయ పార్టీ తీర్ధం పుచ్చుకోవటం బాధాకరం . వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే స్వేచ్చని ఎవరూ కాదనలేరు గానీ సమర్ధుడైన అధికారిగా పేరు గాంచిన ఆయనకి,  ఈనాడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిలో దశాబ్దాల వెనక్కి వెళ్ళటానికి కారణమైన వేర్పాటు తీవ్ర వాదం గురించి తెలియదనుకోవాలా ?  ఆయనకి తెలంగాణా ప్రాంతం అంటే అభిమానం ఉండవచ్చు.. కానీ కుటుంబ ప్రయోజనాలే పరమావధిగా పార్టీని నడుపుతున్న నాయకుని సారధ్యంలో ఆయన తెలంగాణా ప్రాంతానికి ఏం ఒరగ బెడతారన్నది సందేహాస్పదమే!