Sunday, April 17, 2011

వెర్రి కుదిరింది..రోకలి తలకి చుట్టండి..

ప్రత్యెక రాష్ట్రం వస్తుందన్న ఆశ నానాటికీ సన్నగిల్లుతుండటంతో దైవం మీద భారం వేస్తూ శత చండీ యాగం చేసాడు తెలబాన్ దొర!  తప్పు లేదు. ఇష్ట కామ్య సిద్ది కొరకు దైవ సహాయాన్ని అర్ధించడంలో అధిక్షేపించాల్సిన అవసరమే లేదు. 
అయితే ఆకులో అన్నీ వడ్డించి అంచులో ..... రాసినట్లు యాగం చివరలో పిట్టల దొర చేసిన వ్యాఖ్యలు మన్నించ దగ్గవి కాదు. 
ఆంధ్ర బ్రాహ్మణులది ఆర్భాటమట! తెలంగాణా అర్చకులే నిష్ఠ గల వారట!

నవ్వి పోదురు గాక నాకేటి సిగ్గు అన్నట్లు ప్రతి చిన్న విషయాన్నీ ప్రాంతీయ వాద రంగుటద్దాలలోంచే చూస్తూ విద్వేషాలు రగిలించే ఇటువంటి ప్రకటనలు చేయటం క్షంతవ్యం కానే కాదు.   ప్రాంతీయ వాద పైత్యం బాగా ముదిరి పోయిన దొరకి సరైన వైద్యం చేయటానికి తెలంగాణా ప్రాంతానికి చెందిన మంచి వైద్యుడు ఎవరైనా వున్నారేమో తెలబాన్ శ్రేణులు వెదికి వుంచుకుంటే మంచిది.
 (షరా: ఆ వైద్యుడు కూడా ఆంధ్ర ప్రాంతంలో జన్మించి వుండకూడదు / విద్యాభ్యాసం చేసి వుండకూడదు. )

Thursday, April 14, 2011

కళ్ళు తెరిచిన ప్రభుత్వం!

ఇన్నాళ్ళకి రాష్ట్రంలో ప్రభుత్వం నేనున్నాను అంటూ అస్తిత్వం చూపింది.. రాజ్యాంగ బద్దంగా ఎన్నికైన ప్రభుత్వమంటే లెక్కే లేనట్లు ఇష్టానుసారం చెల రేగుతున్న వేర్పాటు వాద శక్తులకి ముకు తాడు వేసే దిశగా జీవో 177  విడుదల చేసింది. ఈ  జీవో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారికీ వర్తిస్తుంది. అయినా కూడా దీని పై తెలబాన్ నాయకులు, తెలంగాణా ప్రాంత ఉద్యోగులు గుమ్మడి కాయ దొంగ బుజాలు తడుముకున్నట్లు రచ్చ చేస్తున్నారు.  అసలు ప్రభుత్వోద్యోగులందరికీ కాండక్టు రూల్సు, డిసిప్లినరీ రూల్సు అనేకం వుంటాయి. అవన్నీ సక్రమంగా అమలు జరిపితే  ఇలాంటి జీవో ఇవ్వాల్సిన అవసరమే వుండదు. అయినా కూడా ఇన్నాళ్ళు సహనం వహించిన ప్రభుత్వం ఇప్పటికైనా కొరడా ఝుళిపించడం అభినందనీయం.  రాజకీయ నాయకులు ఉద్యమాలు, ఆందోళనలు చేసారంటే అది వారి వ్యాపకం కాబట్టి ఆక్షేపించాల్సిన పని లేదు. అయితే తాము చేస్తున్న ఉద్యోగాలతో ఏ  మాత్రం సంబంధం లేని ఆందోళనల కోసం విధులు ఎగ్గోట్టేసి తేరగా ప్రజల సొమ్ము భోం చేద్దామనుకొనే ఉద్యోగుల పట్ల ఇటువంటి చర్య సముచితమే. తెలబాన్  దొర  వెంటనే స్పందిస్తూ ఈ జీవో ఇవ్వడానికి తెలంగాణా మంత్రుల ఆమోదం ఉందా అంటూ రంధ్రాన్వేషణ  మొదలు పెట్టేసాడు! అంతే కాదు! తెలంగాణా మంత్రులంతా రాజీనామా చేయాలని హుకుం జారీ చేసేసాడు! నిజమే...తెలంగాణా మంత్రులే కాదు..తెలంగాణా ప్రాంత ప్రభుత్వ ఉద్యోగులు కూడా (కోదండ రాం తో సహా) తమ తమ కొలువులకి రాజీనామాలు ఇచ్చేసి ఉద్యమంలో పాలు పంచుకుంటే ఎవరికీ ఏ విధమైన అభ్యంతరాలు ఉండబోవు. ప్రభుత్వానికి కూడా ఇలా కర్ర పట్టుకోవాల్సిన పని కూడా వుండదు.

Wednesday, April 13, 2011

శభాష్ దీదీ!

బెంగాల్ విభజనకి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని మమతా బెనర్జీ కుండ బద్దలు కొట్టారు. గోర్ఖాలాండ్ ఏర్పాటుకి తృణమూల్ కాంగ్రెస్ వ్యతిరేకమని దీదీ స్పష్టం చేసారు.  ఎన్నికల ముంగిట్లో....అందులో ప్రతి పక్షంలో ఉంటూ కూడా విధాన నిర్ణయం ధైర్యంగా ప్రకటించటం అభినందించాల్సిన విషయం.

ఈ మాత్రం చేవ, తెగువ మన వాళ్లకి వుంటే తెలంగాణా సమస్య కోతి పుండు బ్రహ్మ రాక్షసిలా తయారయి వుండేది కాదు.  అంతే కాదు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రానికి కావలసినది ఏమిటో శ్రీ కృష్ణ కమిటీ అరటి పండు వలిచి ఇచ్చినట్లు విశదీకరించాక కూడా ఒక విధాన నిర్ణయం తీసుకోకుండా మీన మేషాలు లెక్కిస్తున్న మన రాష్ట్రంలోని రాజకీయ పార్టీలకి..ఎంత సేపూ స్వంత ఎజెండాలని అమలు చేసుకుంటూ పబ్బం గడుపుకోవడమే తప్ప సమస్య పరిష్కారానికి చిత్త శుద్ధి  చూపడం తెలియదన్నది స్పష్టమై పోయింది.

Sunday, April 3, 2011

అతిశయోక్తికైనా హద్దు వుండాలి!

పెట్టుబడులకి అత్యంత అనువైన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ అంటూ ప్రభుత్వం ఈ రోజు పత్రికల్లో విడుదల చేసిన ప్రకటన చూస్తె నవ్వాలో ఏడవాలో తెలీదు. ఓ పక్క తెలబాన్ల దెబ్బకి ఇప్పటికే ఉన్న వ్యాపార వాణిజ్య వర్గాలన్నీ దుకాణాలు కట్టేసుకోవడమో లేదా గుజరాత్ కి తరలి వెళ్లి పోవటమో చేస్తున్నాయి.  ఇక కొత్తగా రాష్ట్రం కేసి తొంగి చూసే ధైర్యం ఏ వ్యాపార వేత్త కి లేనే లేదు. రాష్ట్రం లో ఆస్థిరతకి కారణమైన తెలబాన్ సమస్యని పరిష్కరించకుండా ప్రభుత్వం ఎన్ని మసి పూసి మారేడు కాయ చేసే ప్రకటనలు చేసినా ఏ వాణిజ్య వేత్త నమ్మే పరిస్థితి లేదు. కేవలం తెలబాన్ సమస్య పరిష్కారం కోసమే ఏర్పరచిన శ్రీ కృష్ణ కమిటీ ఇచ్చిన అత్యుత్తమ ఆరో పరిష్కార మార్గం అమలు విషయమై శ్రద్ధ చూపి ఆ తరువాత ఇటువంటి ప్రకటనలు ఇస్తే అర్ధవంతంగా వుంటుంది. ప్రభుత్వానికి నిజంగా చిత్త శుధ్ధి వుంటే తక్షణం వేర్పాటువాదాన్ని కూకటి వేళ్ళతో పెకలించే దిశగా చర్యలు తీసుకొని, రాష్ట్రం లో ప్రశాంత పరిస్థితులు నెలకొలిపే ప్రయత్నం చేయాలి.