Sunday, February 21, 2010

పోలీసులే లోకువ..


రాష్ట్రం లో గత మూడు నెలలుగా ఉన్న ఉద్రిక్త పరిస్థితుల్లో రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తూ శాంతి భద్రతలను కాపాడుతున్న పోలీసులను అభినందించాల్సింది పోయి ఎ చిన్న/పెద్ద సంఘటన జరిగినా వారి మీద రాళ్లేయడం వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తుంది. ధిల్లీ నుంచి గల్లీ స్థాయి నాయకుని వరకు పోలీసులకు అక్షింతలు వేయటానికి రెడీగా వుంటారు. నిషేధాజ్ఞలు అమలులో వున్నప్పుడు సామాన్య జనం మౌనంగా భరిస్తున్నారు కదా! మరి వాటిని ఉల్లంఘించినపుడు చర్యలు తీసుకుంటే తప్పేమిటి? కానీ మన సమాజంలో కొన్ని ప్రత్యెక వర్గాలు వున్నాయి. ఎటువంటి పరిస్థితిలోను వారి పై లాఠీ ఎత్తకూడదు. జర్నలిస్టుల సంగతే తీసుకుంటే, వారి వారి చానేల్సుల్లో,పేపర్లలో వారు రెచ్చగొట్టే వార్తలు, వ్యాఖ్యలు ఎన్నైనా చేయవచ్చు...కానీ వారి మీద లాఠీ ఝుళిపిస్తే అదో పెద్ద నేరం. రాజకీయ నాయకులైనా అంతే. వారిని అరెస్టు చేసినా కూడా వారిని పొలిసు స్టేషన్లలో అత్తారింట్లో అల్లుడి లాగ చూసుకోవాలి. లేక పొతే ఇంతే సంగతి. లగడపాటి వంటి ఎం.పీ. స్థాయి నాయకుడు సినిమాటిక్ గా ప్లాన్ చేసి తప్పించుకుంటే కాపలాగా ఉన్న కొద్ది మంది సిబ్బంది ఏమి చేయగలరు? ఎక్కడో ఉన్న పోలీసు కమిషనర్ ఏమి చేయ గలడు? ఇక విద్యార్ధులున్నారు. వారిని చదువుకొని బాగు పడమని విద్యాలయాలకు పంపిస్తే, తిన్నది అరక్క ఉద్యమాలు, ఆత్మహత్యలు చేసుకుంటే పోలీసులదా బాధ్యత? పోలీసులలో లోపాలు లేవని కాదు. కాని ప్రతి విషయానికీ వారిని తప్పు పట్టడం మంచి పద్ధతి కాదు.

2 comments: