Friday, February 19, 2010

జాయింటు ఊడిన కమిటీ!




అంతా ఊహించినట్లే జరిగింది. తెలంగాణా జే.ఎ.సి. లోంచి ముక్క ఊడింది. (జనవరి 21 వ తేదీనాటి నా ముందరి టపా చదవండి. http://andhraaakasaramanna.blogspot.com/2010/01/blog-post_21.html ) . రాజీనామాలకే కాంగ్రెసుతో లింకు పెట్టిన తెలుగు దేశం ఇంకా జే.ఎ.సి. లో కొనసాగుతుందని భావించలేం. ఒంటెత్తు పోకడలతో ప్రధాన పార్టీలను దూరం చేసుకుని ఏమి సాధిస్తారో తెలీదు. ఇంకా ఈ రోజు మజ్లిస్ పార్టీకి చెందిన శాసన సభ్యుడు అక్బరుద్దీన్-- హైదరాబాదు ఎ ఒక్కరి సొత్తు కాదు అని ప్రకటించటమే కాక చిన్న రాష్ట్రాలుగా విభజనకు తాము వ్యతిరేకమని విష్పష్టంగా ప్రకటించారు. మరి సమైక్య వాదాన్ని బలపరచిన చిరంజీవి, మోహన్ బాబు, రోజా, లగడపాటి..చివరికి కంచి స్వామిని కూడా విడువకుండా దుర్భాషలాడిన తెలబాన్లు మజ్లిస్ ని పల్లెత్తు మాట అన గలరా? అలా అనాలని నా ఉద్దేశ్యం కాదు. హైదరాబాదులో గట్టి పట్టు ఉన్న పార్టీ తమ వైఖరి స్పష్టం చేసాక...ఈ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేయడానికే మొహం చెల్లని వారి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం ఇక ఎంత మాత్రం లేదు. తక్కిన విషయాలు తేల్చటానికి శ్రీ కృష్ణ కమిషన్ ఎటూ ఉంది. కనుక ఇప్పటికైనా విద్యార్ధులే కాక అన్ని వర్గాల వారూ ఆందోళన లు విరమించి కాగల కార్యం శ్రీకృష్ణునికి వదిలి రాష్ట్రంలో మునుపటి ప్రశాంతత తెస్తే బాగుంటుంది.

1 comment:

  1. ఇంక విద్యార్దులు ప్రొఫెసర్లు చదువుల్లో దిగటం మంచిదేమో పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి.

    ReplyDelete