Sunday, December 27, 2009

కే సి ఆర్ పుష్కర పురాణం


ప్రాంతీయ విద్వేషాల్ని రెచ్చ గోట్టటంలో దిట్ట ఐన కే సి ఆర్ ఈ మధ్య ఓ పుష్కర పురాణం చెప్పాడు. అదేమిటంటే కృష్ణ పుష్కరాలు వస్తే విజయవాడ కే పోవాల? గోదావరి పుష్కరాలు ఐతే రాజమండ్రి కే వెళ్ళాలా? మా దగ్గర ఆ నదులు లేవా..అంటూ సాగింది ఆ పురాణ కాలక్షేపం..
ఇక్కడ ఓ సంగతి గమనించాలి. ప్రాంతాలకి అతీతంగా ఎవరికైనా వీసా కావాలి అంటే అందరం చిలుకూరు బాలాజీ గుడికి వెళ్తున్నామా లేదా ? పిల్లలు గొప్ప చదువులు పొందాలని అక్షరాభ్యాసం బాసరలో చేయిస్తున్నాము కాదా? అలాగే ప్రతి ఊళ్ళోనూ రామాలయం వున్నా భద్రాచలం ఎందుకు వెళుతున్నాం? ఇంకా వేములవాడ, యాదగిరి గుట్ట , మెదక్ చర్చి, మక్కా మసీదు ..ఇవన్నీ జగత్ ప్రసిద్ధాలు కాదా?? అవన్నీ తెలంగాణా ప్రాంతంలోనే కదా వున్నాయి.. దీన్ని బట్టి అర్ధం ఏమిటంటే, పురాణ ప్రాశస్త్యం, ప్రజల నమ్మకాలను బట్టే ఆయా ప్రదేశాలకు యాత్రికులు వెళతారు మరియు ప్రభుత్వం కూడా ఆ ప్రాధాన్యతని బట్టి ఏర్పాట్లు చేస్తుంది.
ఈ చిన్న విషయాన్నీ కూడా వేర్పాటువాద దృష్టితో చూస్తూ విషం చిమ్మే కే సి ఆర్ మాటల్ని లైవ్ లో ప్రసారం చేస్తున్న మీడియా కూడా దోషి అని చెప్పి తీరాలి.

1 comment:

  1. వెరీ గుడ్. బాగా చెప్పారు. ఇలాగే తెలబాన్ల అకృత్యాలను, ప్రేలాపనలను తిప్పికొట్టాలి.

    ReplyDelete