Wednesday, June 22, 2011

నివాళి ఇచ్చే విధానం ఇదా?

ఆచార్య జయశంకర్ వంటి మేధావిని, విద్యా వేత్తని కోల్పోవటం కేవలం తెలంగాణా ప్రాంతానికే కాదు...తెలుగు వారందరికీ తీరని లోటే. విద్యా రంగంలో ఆయన మన రాష్ట్రానికి చేసిన సేవలు చిరస్మరణీయం. అలాగే తాను నమ్మిన సిద్దాంతం పట్ల నిబద్ధత, తన సిద్ధాంత వ్యాప్తి కోసం ఎంచుకున్న గాంధేయ మార్గం కూడా మెచ్చ దగ్గవి. అయితే ఆయన మరణానంతరం నివాళి అర్పించటానికి వచ్చిన తెలంగాణా నాయకులని తెలబాన్ శ్రేణులు చొక్కాలు చిరిగేలా కొట్టటం, రాళ్ళతో దాడి చేయటం ఎ మాత్రం సమర్ధనీయం కాదు. జయ శంకర్ కూడా జీవించి వున్నప్పుడు ఎటువంటి హింసా వాదాన్ని సమర్ధించలేదు. వసూళ్ళ నాయకుల చేతిలో పడి తెలంగాణా ఉద్యమం ఏనాడో పెడ తోవ పట్టింది. కనీసం ఉద్యమ సిద్ధాంత కర్త మరణించిన విషాద సమయంలో సైతం సంయమనం లేకుండా తెలబాన్ శ్రేణులు ప్రవర్తించాయి. జయ శంకర్ అంతిమ యాత్ర జరిగిన సమయంలో కూడా రెచ్చి పోయిన తెలబాన్లు స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహం పై రాళ్ళతో చెప్పులతో దాడి చేయటం పెచ్చరిల్లిన ఉన్మాదానికి పరాకాష్ట. ఉద్యమం ముసుగులో ఏమి చేసినా చెల్లి పోతుందనే ధీమా వారి చర్యల్లో కన పడుతోంది. ఇప్పటికే ఎన్టీఆర్ కి అత్యంత ప్రియమైన టాంక్ బండ్ విగ్రహాలని కూలదోసి ఆయన ఆత్మని క్షోభింప జేసిన తెలబాన్లు ఇక ఏకంగా ఆయన విగ్రహాలపైనే ప్రతాపం చూపారు. ఈ అరాచకత్వాలని ఇక ఎంత మాత్రం సహించకూడదు. ప్రభుత్వం అనేది ఒకటి ఉందన్న స్పృహ కూడా లేకుండా పెచ్చరిల్లుతున్న వేర్పాటు తీవ్ర వాద గణాల భరతం పట్టే దిశగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతైనా వుంది

6 comments:

  1. పుట్టపర్తి యజుర్మందిరంలో పట్టుపడుతున్న సొమ్ము వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
    ప్రధానితో సహా ఇతర గ్రేడ్‌-1 ప్రభుత్వ అధికారులూ న్యాయమూర్తులూ అందరూ లోక్‌ పాల్‌ పరిధిలోకి తేబడాలి
    అమ్మఒడి అమ్మవడి అయ్యినప్పుడు, ఒంటేలు వంటేలు ఎందుకు కాడో మౌళి గారు వివరణ ఇవ్వాలి

    ReplyDelete
  2. మనం ఒప్పుకుంటే
    గాడ్సే కూడా మహాత్మా గాంధి శవానికి నివాళి అర్పించేందుకు వస్తాడు.
    ఒప్పుకున్దామా?
    ఎవడు పడితే వాడు నివాళి పేరిట డ్రామా ఆడితే ఎవరికైనా కాలదా?

    >>>>
    ప్రభుత్వం అనేది ఒకటి ఉందన్న స్పృహ కూడా లేకుండా పెచ్చరిల్లుతున్న వేర్పాటు తీవ్ర వాద గణాల భరతం పట్టే దిశగా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఎంతైనా వుంది <<<<<
    నీ అస్సలు ఉద్దేశం గిదన్న మాట !
    ఇదే ప్రభుత్వం కదా పార్లమెంటు లో రాష్ట్ర పతి అబ్దుల్ కలం ఆజాద్ చేత, ప్రధాని మన్మోహన్ చేత తెలంగాణాపై ప్రకటనలు చేయించింది.
    ఇదే ప్రభుత్వం కదా హోం మంత్రి చిదంబరం చేత తెలంగాణా ప్రక్రియ మొదలు పెద్తున్నాం అని చెప్పించింది
    ఆ ఆటలు, మాటలు , మోసాలు నాయవంచనలు ఏమి కనపడటం లేదా.
    Goutham

    ReplyDelete
  3. @ anonymous above:
    ఇదే ప్రభుత్వం అదే చిదంబరం చేత చేసిన పొరపాటుని సరిదిద్దే ప్రకటనని కూడా చెప్పించింది. ఈ విషయం కూడా గుర్తుంచుకోవాలి.

    ReplyDelete
  4. "జయ శంకర్ కూడా జీవించి వున్నప్పుడు ఎటువంటి హింసా వాదాన్ని సమర్ధించలేదు"

    Thanks a lot for acknowledging that Prof. Jayashankar was not a "తెలబాన్". Can you please follow it up with a list of other Telangana leaders whom you do not so label (while they are still alive, not after they pass away).

    ReplyDelete
  5. అవునవును ఇంకేమాత్రం సహించకండిరా లుచ్ఛా కొడుకుల్లారా! మూటా ముళ్ళే సర్దుకుని హైదరాబాద్ నుండి దొబ్బెయ్యండి.

    ReplyDelete