Friday, December 27, 2013

ఆంక్షలు లేక పొతే అంతే సంగతులు !

దేశంలోని మిగతా 28 రాష్ట్రాల మాదిరి తెలంగాణా  కూడా అంక్షలు లేని విధంగా ఏర్పరచాలని డిమాండ్ చేస్తున్న తెలబాన్ నాయకునికి దేశంలో మిగతా రాష్ట్రాలు ఏకాభిప్రాయం తో ఏర్పడ్డాయని,  సంప్రదాయానుసారం  విభజనకి పూర్వపు శాసన సభ తీర్మానం ద్వారానే ఆయా కొత్త రాష్ట్రాల ఏర్పాటుకి నాంది జరిగిందని తెలియదా? కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాలే కొత్త రాజదానులని ఏర్పాటు చేసుకున్నాయి కానీ ఉమ్మడిగా అభివృద్ది చెందిన రాజధానిని కైంకర్యం చేస్తూ అవశిష్ట ప్రాంతానికి మొండి చెయ్యి చూపించే విధంగా ఇంతకూ ముందు ఏ రాష్ట్రమైనా ఏర్పడిందా?   కానీ తెలంగాణా విషయంలో ఏం జరుగుతోంది ?  2009 డిసెంబర్ 9 ప్రకటనలో కేంద్ర హొమ్ మంత్రి తెలంగాణా ఏర్పాటుకై ఆంధ్ర ప్రదేశ్ శాసన సభలో ప్రక్రియ ప్రారంభిస్తామని ప్రకటించగా, ఈనాడు   విభజన వాదులు కేంద్రంతో కుమ్మక్కు అయిన ఫలితంగా మొదటి ప్రక్రియనుండే  తొండి ఆట మొదలు పెట్టారు.    ఒక రాష్ట్ర  విభజన వంటి ప్రాముఖ్యమైన విషయం కేంద్ర కేబినెట్ సమావేశం ఎజెండా లో వుండదు..నోట్ తయారు అవుతున్న విషయం సాక్షాత్తు కేంద్ర హొమ్ మంత్రికి మధ్యాహ్నానికి తెలియదు...  కానీ సాయంత్రానికల్లా  టేబుల్ పాయింటు గా ప్రత్యక్షమై ఆమోదమై పోతుంది!   అలాగే మంత్రుల కూటమి! ఒక తెలుగు రాష్ట్రాన్ని విభజించే ప్రక్రియలో ఒక్క తెలుగు మంత్రి కూడా ఉండడు.. మంత్రుల కూటమి కూడా హస్తిన వదలి రాదు.. కానీ చిత్తం వచ్చినట్లు నివేదిక తయారు చేయటంలో మాత్రం వారు సిద్ధ హస్తులు.  రెండు నెలలు కూర్చుని వారు వండి వార్చిన నివేదిక తో బిల్లు సిద్ధమయ్యాక కూడా మళ్ళీ అదే తంతు!  టేబుల్ పాయింటు గా కేబినేట్ సమావేశం లో బిల్లు ప్రవేశ పెట్టి -  సీమాంధ్ర మంత్రులు బిల్లు పరిశీలించటానికి సమయం అడిగినా నిరాకరించి బలవంతపు ఆమోదం జరిగిన సంగతి తెలిసిందే!  ఇక రాష్ట్రపతి నుండి తిరిగి వచ్చిన బిల్లుని  ప్రత్యెక దూత ద్వారా ప్రత్యెక యుద్ధ విమానంలో హైదరాబాదు కి పంపటం కొస మెరుపు!  ఈ అవకరాలన్నీ ఒక ఎత్తు ఐతే, తెలబాన్ల అరాచకాలు మరో ఎత్తు! ప్రత్యెక రాష్ట్ర ప్రస్తావనే లేని రోజుల్లోనే వారు చేసిన అరాచకాలకి లెక్కే లెదు.  
 సమైక్య రాష్ట్రంలో తెలంగాణా రాష్ట్రం పేరిట ఫలకాలు ఏర్పాటు చేయటం, వాహనాలకి టీజీ స్టిక్కర్లు అంటించటం, జాగో భాగో అనటం, తరిమి కోడతామనటం, పండక్కి వెళ్ళిన సీమాంధ్రులని తిరిగి రానివ్వమనటం, ఆస్తులు లాక్కుంటామనటం, సీమాంధ్రుల భూములు పంచేస్తామనటం ఇలా ఒకటా రెండా... అంతు లేని కధ ఆ అరాచకం!  అదంతా గతం!  ఇప్పుడు కేంద్రం ప్రత్యెక రాష్ట్రానికి సై  అనగానే తెలబాన్ నాయకుడు జూలు విదిల్చాడు.
 సాక్షాత్తు ముఖ్య మంత్రినే టిఫిన్ సెంటర్ పెట్టుకోమన్నాడు. తమకి కప్పం కడుతూ బతకమన్నాడు..ఉద్యోగులకి ఆప్షన్లు లేవన్నాడు..సీమాంధ్రకి వెళ్లి పోవాల్సిందే అన్నాడు.. నాయకుడు అలా వుంటే అనుచర గణం  ఇంకెలా వుంటుంది? 

 డిసెంబర్ 31తరువాత సీమాంధ్రులని వెళ్ళ గోట్టాలంటూ రబ్బరు స్టాంపులు వేసి మరీ ప్రచారం చేస్తున్నారు!  ఇన్ని అవకారాలు, అరాచకాలు ఉన్న పరిస్థితిలో - దొంగ చేతికే తాళం ఇచ్చినట్లు - సీమాంధ్రకి, సీమాంధ్ర ప్రజలకి తగిన ప్రత్యామ్నాయాలు, రక్షణలు  చూపకుండా - హడావిడిగా రాష్ట్ర విభజన సాధ్యమా?  ఎట్టి పరిస్థితిలో కానే కాదు!!      

13 comments:

  1. ఒరెయ్ మొద్దు తెలపాము తాగుబోతు,
    సోమరి, సొంబేరి, సమాజంతొ
    కలిసుండమని దశాబ్దాలముందే
    బలిదానాల్తొ ఎలుగెత్తి చాటామురా

    మా కష్టం,శ్రమ, రక్తం, కన్నీరు,
    నీళ్ళు, కరంట్ దోచుకున్న దొంగ సమాజం
    మాకొద్దు అని మొర పెట్టుకున్నాం

    చదువు సంస్కారం జ్ఞానం లేని
    సావాసం వద్దంటే వద్దు బాబొయ్

    పక్కలో తెలబానులుం తెలపాములు వద్దు
    విష తెలబాన్, సర్పాచారులు, గూండాలు,
    మొద్దు వెధవలు వద్దురా సోదరా వద్దు.

    మా కష్తం, మా శ్రమ, మా నెత్తురు
    మాకిచ్చెయ్యండి, మీరూ కష్ట పడ్డం నేర్చుకోండి
    విషం, విద్వెషం, అసూయా, అబద్దాలు వద్దు,
    పక్కోడి కష్టాన్ని దొచుకొని, ఇంకా సోమరులు సోంబెరులు
    కావద్దు.

    ReplyDelete
  2. ఇవ్వాళ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బిల్ల్లుపైన చర్చ యెలా జరగాలి, ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పైన యెలా ముందుకెళ్ళాలి అని ఇదివరకు విభజన జరిగిన అసంబ్లీ లని విచారిస్తే బిల్లు పైన యేదో ఒక రూపంలో - అంటే బిల్లులోని అంశాల పైన గానీ సవరణల పైన గానీ - వోటింగు తప్పనిసరిగా ఉండాలనేది తేలింది.
    ముందునుంచీ తెవాదులు దేన్ని తప్పించుకోవాలని ఆర్టికిల్ మూడు మరియు కేంద్రం ద్వారా తెచ్చుకోవాలని వెళ్ళారో అదే మళ్ళీ వాళ్ళ ముందు నిలబడింది.మొత్తం విభజనకి సంబంధించిన అన్ని దశల లోనూ రాజ్యంగం వర్తిస్తుందనే గమనిక గానీ ఆర్టికిల్ మూడు అనేది ప్రక్రియ మొదలు పెట్టటానికి మాత్రమే పనికొస్తుంది గానీ అసలు అసంబ్లీని పూర్తిగా యెవ్వరూ నిరాకరించలేరని గానీ యేదీ పూర్తిగా తెలుసుకోకుండా ఆర్టికిల్ మూడు, కాంగ్రెసు , మరియు నా ఉబ్బిన ముక్కు చాలు రాష్ట్రం తీసుకొచ్చెయ్యటానికి అనుకున్న పిట్టల దొరనీ అతన్ని నమ్ముకున్న తెవాదుల్నీ కాలం పదేళ్ళు వెనక్కి తీసుకెళ్ళి తప్పించుకోవాలనుకున్న చోటుకే తీసుకొచ్చి వదిలింది.

    ReplyDelete
  3. we want telangana with 10 districts.that is why we are agitation in 10 district only.whereas,you people want united ap with 23 districts but you are agitating in 13 districts only.even in Hyderabad,only seemandhra origin people are asking for united ap but not telangana origin people.
    in 10 districts of telangana,wether it is govt employees strike,lawyers court boycott,dharna,bandh or rasta rook,all are for separation only,not for unification.how can 13 district people only "demand" unity of 23 districts???
    doesnt it sound illogical

    ReplyDelete
    Replies
    1. ఒరెయ్ పిచ్చి నా తల లేని తాగుబోతు తెలబాను, కాశ్మీరు కూడా మేము విడిపోతామంటే దేశ ప్రజలకేం సమస్య. మా ఇష్టం కదా ముఖ్యం అంటే మీలాగే వాళ్ళకి కూడా వేరె దేశం ఇస్తే పోలా? మీ లాజిక్ ప్రకారం, మిగతా దశంలో చాలా మందికి కాశ్మీరుతొ ఏ రకమైయిన సంబంధం లేదు.అయినా ఎందుకు ఒప్పుకోరు? ఎందుకంటే, దేస ప్రజల కష్టం, శ్రమ,నెత్తురు సెంటిమెంట్ ఉన్నాయి మరి. ఇన్ని సంవత్సరాలు మంది సొమ్ము, సొత్తు తేర్గ దొబ్బి, ఈ రోజు ఇది మాదే అంటే ఎవడూ చెవిలో పువ్వెట్టుక్కూర్చోడు.యుద్ధం చేస్తారు.మా మేధ, నీళ్ళూ, కరంట్, శ్రమ, రక్తం ధార పోస్తేనే ఈ రోజు ఈ స్థితిలో ఉన్నారు. లేకపోతే, గుడుంబా, గోచీ రోజుల్లోనే ఉండే వారు. మరిచిపోకు గతాన్ని.

      Delete
    2. @anonymous
      Kashmir wants separate country,which is prohibited by the constitution whereas what we want is only separate state which is not prohibited.so you want separate state ONLY FOR YOUR MONEY and not out of love or concern for telangana people.right?

      Delete
  4. ఆంధ్రోళ్ళు అని మరీ అలా తిడితే రేపు సభలో వోటింగు అప్పుడు ఇబ్బంది కదా బాసులూ కాస్త నెమ్మదిగా ఉండొచ్చు గదా అని నేనంటే - అక్కడ భాజపా సూత్రప్రాయంగా గట్తిగా నిలబడి ఉంటే మీ తొక్కలో ఆంధ్రోళ్ళు మా కనుకూలంగా వోటు వెయ్యకపోయినా ఫరవాలేదు లెమ్మన్నారు.చాలా హుందా అయిన పధ్ధతిలో మీ ఉద్యమంలో చాలా వైరుధ్యాలు ఉన్నాయి, వాటిని తొలగించుకోండని చెప్పిన నన్ను కూడా వెక్కిరించేశారు. ఇప్పుడు వోటింగు తప్పని సరి - అంటే మెజార్టీ సభ్యుల అభిప్రాయమే అంతిమంగా ఫలితాన్ని నిర్ణయిస్తుంది. అలోచించుకోండి.

    ReplyDelete
  5. విడిపోవటానికి ఇరు వర్గాలు ఒప్పుకున్నా రాష్ట్రాలలో వారికి అన్ని విదాల న్యాయం చేసారు. మీరు ఒప్పుకోవట్లేదు కాబట్టి మీకు వాతలు పెడుతున్నారు, తిక్క కుదిరింది.
    అసలు మీరు విడిపోవటానికి సిద్దం అంటే మీ డిమాండ్లు ఏమిటో పరిశీలించే వారు, అసలు మీ డిమాండ్లు ఏమిటో ఒక్కడన్నా చెపుతున్నాడా, మీ నాయకులు ప్రజలలోనే లేని సమైక్యతా ఇంకోడితో ఎలా కోరుకుంటారు.

    ReplyDelete
    Replies
    1. తిక్క కుదిరేది ఎవరికో తొందరలోనే తెలుస్తుంది. తెలంగాణా కి మిగిలేది వీగి పోయే బిల్లు - సోనియమ్మ గుళ్ళు! పూజలు చేసుకొని తరించండి.. సోనియా కటాక్ష ప్రాప్తిరస్తు..

      Delete
    2. విగిపోతుందా ... సరే సరే అదే బ్రమాలతో గత పదేళ్లుగా ఉంటున్నారు, ఇంకొంత కాలం ఉంటె సరిపోతుంది. కాంగ్రేసు, బాజాప మద్దతు ఉన్నంత కాలం బిల్లు పాసుకు డోకా లేదు, వారు సీమంద్ర నాయకుల వలె పదే పదే మాట తప్పే నిచపు జాతి కారు.

      Delete
    3. కాంగ్రేసు మద్దతా? తెలంగాణా బిల్లు తెచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ వారే అవిశ్వాసం పెడితే లోక్ సభ సమావేశం పెట్టె ధైర్యం లేక వాయిదా వేసారు.. ఇంక బిల్లుకి డోకా వుండదు.. మహిళా బిల్లు పక్కనే ఏళ్ల తరబడి విముక్తికై ఎదురు చూస్తూ వుంటుంది..

      Delete
  6. ఇట్లాంటి దొంగ తెలివితేటలూ సిమాంద్రోల్లవే, తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు ఎలాగు ఆగటం లేదు అని నోట్లపై స్టాంపులు కొట్టే ఇట్లాంటి చిల్లర పనులు చేసి ఏదో సాదిద్దామని అత్యాశ. అధికారం కోసం హైదరాబాదులో ఎన్ని మత గర్షణలు చెయ్యలేదు మివోల్లు. పార్లమెంటులో బిల్లు గెలుస్తుందని అందరికి తెలిసిందే, అంటే దేశం అంతా తెలంగాణా వైపు ఉన్నట్లే, మీరు దోపిడీదారులని నిరుపితం అయినట్లే :) అదే జరుగుతుంది

    ReplyDelete
  7. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తెలంగాణ వారు అంతర్జాతీయ స్తాయిలో అబివృద్ది చెందిన హైదరాబాదును, బ్యాంకులలో భారి బాలన్సును ఇంచ్చారు, మరి మిరేమిచ్చారు దివాలా తీసే లెవల్లో అప్పులు, ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు బిల్లులో ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయ్. బాగా అభివృద్ధి చెందినా పట్టణాన్ని పట్టుకొని మేమే అభివృద్ధి చేసినం అని సంకలు గుడ్డుకోవటం, ఏది మాల్లి ఇంకోటి చేసి చుపియ్యు అంటే దొంగ చూపులు చూడటం. సొంత రాజధాని కట్టుకోలేక దేరాలలో బతికినా బతుకులు, పాపం ఇసంత రా అంటే ఇల్లంతా నాదే అంటున్నరు.

    ReplyDelete
  8. అసలు విలీనం ప్రతిపాదన యెందుకు చెయ్యటం? కాంగ్రెసు పార్టీ సహకారం తో తెలంగాణాని తెచ్చుకోవాలనుకుంటే ఉద్యమం జరిగే కాలంలో సహకరించుకోవటం ద్వారా ఆ పార్టీకి బహిరంగంగా యే ఆక్షేపణా రాని సజావయిన పధ్ధతి లోనే సహాయం చేసి తనూ లాభపడి ఉండ వచ్చు కదా?
    మొదట ఉద్యమంలో కాంగ్రెసుని కూడా చొరబడనివ్వకుండా చేసి తనకొక్కడికే బలం పెరిగాక ఆ బలాన్ని నీకు ధారపోస్తాననదం ఒక వైరుధ్యం. కాంగ్రెసు సాయంతో రాష్ట్రాన్ని తెచ్చ్చుకోవాలనుకున్న పెద్దమనిషి ఉద్యమంలో మాత్రం ఉదారంగా వ్యవహరించక పోవటానికి కారణ మేమిటి?తెవాదులు మొదట్లో అసెంబ్లీ ప్రతిపాదనలో తమకు న్యాయం జరగదని ఒక న్యాయమూర్తిని యెంచుకుని తీర్పు కోసం అడిగామని అన్నారు.కానీ విలీనం ఒప్పందంతో అది కాస్తా నాకది నీకిది అనే తోడుదొంగల ఒప్పందంగా మారిపోయింది.ఈ తోడుదొంగలిద్దరూ యెదటి వాణ్ణి యే మాత్రమూ నమ్మని, యెదటివాడికి తనమీద యే మాత్రమూ నమ్మకం కలిగేలా నడుచుకోకుండా ఒకడ్నొకడు ముంచి బాగు పడాలనే సుగుణాల కుప్పలు.కచరా యేమో కాంగ్రెసు ద్వారా రాష్ట్రాన్ని తెచ్చుకోవాలనుకుంటూనే ఉద్యమంలో మాత్రం ఆ కాంగ్రెసుని కూడా తొక్కేసి తను మాత్రమే యెదగటం అనే వ్యూహాన్ని ఫాలో అయ్యాడు.కాంగ్రెసు యేమో తెలంగాణాకి అనుకూలం అంటూనే యెలాగయినా ఉద్యమాన్ని కచరా నించి హైజాక్ చెయ్యాలని తె.కా.వా ల ద్వారా విశ్వ ప్రయత్నాలు చేసి అది కుదరక వీలయినప్పుడల్లా మొట్టికాయల్తో తన ఆధిక్యతని చూపిస్తూ(రాయల తెలంగాణా గుర్తుందిగా!) తనకి మాత్రమే లాభం కలిగేలా తెలంగాణాని యేర్పాటు చెయ్యటానికే అవకాశం కోసం యెదురు చూస్తున్నది. తెవాదులా సవాదులా అనే తేడా లేకుండా మొత్తం రెండు ప్రాంతాల్లోని ప్రజల పరువు బజార్న పడింది ఆ తెలివి తక్కువ ప్రతిపాదన వల్ల.
    రాష్ట్ర సాధనకు రావలసిన కీర్తినీ రాష్ట్ర పునర్నిర్మాణంలో తన ప్రమేయాన్నీ వొదులుకోకుండా ఉండాలనుకుంటే విలీనం ప్రతిపాదన చేసి ఉండాల్సింది కాదు.విలీనం ప్రతిపాదన తనే చేసి అందువల్లనే మేము రాష్ట్రాన్ని ఇస్తున్నాము అని వాళ్ళు అన్నప్పుడు విలీనం చేసి తీరాల్సిందే. కాంగ్రెసు అంత అర్ధంతరంగా సభని ముగించేసింది అవిశ్వాసం వల్లనే కావచ్చు గానీ అది జరక్క పోయినా సభలో టి బిల్లుని పెట్టి ఉండేది కాదేమో?ఇక్కడ అసెంబ్లీ పని పూర్తయ్యాక అక్కడ సభని మొదలు పెట్టేముందు మరోసారి విలీనం తెర ముందుకి రావచ్చు.
    కాంగ్రెసు విలీనం గురించి పట్టు పట్టకుండా ఉంటేనే విభజన సజావుగా జరిగే అవకాశం ఉంది. ఈ వ్యవహార మంతటిలోనూ యెదవ లయింది తె.కా.వా లు. వీళ్ళు తెరాస నుంచి ఉద్యమాన్ని హైజాక్ చెయ్యగలరనే కాంగ్రెసు అధిష్తానం విభజనకి తెర యెత్తింది. పైవాళ్ళని పాదాలు నిమిరి పదవులు సంపాదించటమే తప్ప ప్రజల్లో పలుకుబడి లేని వాళ్ళు సహజంగానే అట్లాంటి వాటిల్లో ఫెయిల్ అవుతారు.అయ్యారు. ఇప్పటి రాజకీయ వాతావరణాన్ని బట్టి చూస్తే కాంగ్రెసు పార్టీ పట్టు పట్టకుండా ఉండదు. విలీనం తప్పని సరి అయితే తెరాసలో తుఫాను తప్పదు.ఇరు వర్గాలూ కాలానికీ దైవానికీ అప్పజెప్పి యెదురు చూడ్డమే తప్ప యెవరికీ యేదీ నిశ్చయంగా లేదు.విభజన వల్ల మంచి జరిగినా చెడు జరిగినా ఇద్దరికీ సమానంగానే జరుగుతుంది. అప్పుడు కూడా పంచుకోవాల్సిన వాళ్లంగానే ఉంటాం. కాబట్టి యెవరికి వారు తమ వాదనల్ని సభ్యతా పరిధులు దాటకుండా చెయ్యటం చాలా అవసరం.కార్య సాధకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం వాక్కుని నిగ్రహించుకోవటం.ఈ దేశ చరిత్ర లోని అతి ముఖ్యమయిన సన్నివేశాలన్నిటినీ నేను విశ్లేషణాత్మకంగా చదివాను. ఆఖరి నిముషంలో కూడా చరిత్ర యెవరూ వూహించని మలుపుని తీసుకున్న సన్నివేశాలు యెన్నో ఉన్నాయి.తస్మాత్ జాగ్రత్త, జాగ్రత్త! ప్రమాదో ధీమతా మపి!!
    ప్రతి పక్షంలో ఉన్న పార్టీ లంటే గందరగోళం లో ఉండి రెండుగా చీలి సమైక్యానికి కొందరు విభజనకి కొనదరూ పనిచెయ్యటం గురించి సమర్ధించుకోవచ్చు.కానీ అక్కడా ఇక్కడా అధికారంలో ఉండి కూడా తను కేంద్రంలో తీసుకున్న విధాన నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గిర్నుంచీ పార్టీ సీనియర్లతో సహా వ్యతిరేకిస్తుంటే వాళ్ళని పట్టించుకోవటం గానీ లేదా వాళ్ళ వ్యతిరేకతని అణిచి వెయ్యటం గానీ యేదీ చెయ్యకుండా ఒక అసందిగ్ధతని - కచరాకి ఝలక్కు లివ్వడానికి పనికొస్తుందని రెండు ముఠాల్ని - కొనసాగించడమే ఇప్పటి దరిద్రానికి కారణం.
    విభజన యెలా చెయ్యాలో తెలియని వాళ్ళు మూసుకుని కూర్చోకుండా తెలియని పనికి తెగబడ్డం దేనికి?దేశానికి స్వతంత్రం వొచ్చింది మొదలు యెక్కడ వేలు పెడితే అక్కడల్లా కుంపట్లు రగిలించటమే తప్ప యే ఒక్క కుంపట్నీ ఆర్పటం చెయ్యని వాళ్ళు మొదటి సారి ఒక కుంపటిని ఆర్పుతున్నారు లెమ్మనుకున్నా. అది సరిగ్గా చెయ్యగలిగితే, విడిపోయిన తర్వాత పోట్లాడుకోకుండా అన్నీ సరిగ్గా పంచేసి విడగొడితే యేవడు కాదంటాడు?ఒక సమస్యని పరిష్కరించటాన్ని కూడా సమస్యగా మార్చేసింది కాంగ్రెసు అనే ఒక దరిద్రగొట్టు పార్టీ, ఛీ! ఛీ ఛీ!! ఛీ ఛీ ఛీ!!!

    ReplyDelete