Saturday, December 18, 2010

శభాష్ డీ.జీ.పీ.!

డీజీపీ గారు లెస్స పలికారు.. డిసెంబరు 31 తరువాత రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తే అరెష్టులు తప్పవని వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఈ ప్రకటన చేసింది ఒంగోలులో!  రాష్త్రం మొత్తాన్ని వుద్దేశించి ప్రకటన చేసినా  భుజాలు తడుముకొని వుడికి పోతున్నది మాత్రం తెలబాన్లు.. పైగా డీజీపీ ప్రభుత్వ వుద్యోగి మాత్రమేననీ, ప్రభుత్వం చెప్పినట్లే వినాలి తప్ప ఇలా ప్రకటనలు చేయకూడదనీ ఫత్వాలు జారీ చేశారు.  ప్రభుత్వం అడిగితే తప్ప అదనపు బలగాలు కేంద్రం నుండి రావనీ, ప్రభుత్వ ముందస్తు అనుమతి లేకుండా డీజీపీ స్థాయి అధికారి ఏ ప్రకటన చేయడన్న ఇంగిత జ్ఞానం తెలబాన్లకి లేకపోవటం శోచనీయం.  తాము స్వయంగా ప్రజా ప్రతినిధులై వుండికూడా   బాధ్యతా రహితంగా చవటలు, దద్దమ్మలు వంటి భాషను వాడుతూ- అంతర్యుధ్ధం తప్పదు, అగ్ని గుండం చేస్తాం అంటూ వెర్రి ప్రేలాపనలు చేస్తున్న తెలబాన్లకి  శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత గల అధికారిని విమర్శించే హక్కు ఏ మాత్రం లేదు.  అయినా ఒక్కటి మాత్రం నిజం. ప్రత్యేక తెలంగాణా వుద్యమం అన్నది గతించిన చరిత్ర.  ఇప్పుడు తెర పై జరుగుతున్నది కేవలం తమ వునికిని కాపాడుకోవటానికో లేదా తమ స్వార్ధ ప్రయోజనాల కోసమో తెలబాన్లు ఆడుతున్న నాటకం మాత్రమే!  వారి నాటకాల్ని రక్తి కట్టించటానికి రాష్ట్రంలో శాంతి భద్రతల్ని పణంగా పెట్టడానికి వీల్లేదు. ఇప్పటికే గత సంవత్సర కాలంగా అభివృధ్ధి అన్న మాట వినబడని మన రాష్ట్రం మరింత దిగజారితే కోలుకోవటం చాలా కష్టం.  డీజీపీ గారూ.. గో ఎహెడ్.. మరో ఆపరేషన్ బ్లూ స్టార్ కి రెడీ అవ్వండి.  రాష్ట్రాన్ని అగ్ని గుండం కాకుండా మీరు చేపట్ట బోయే చర్యలకి  ప్రభుత్వ సహకారమే గాక ప్రజలందరి మద్దతు కూడా మీకు వుంటుంది...

7 comments:

  1. ramannaaa.......Same applies to Andhra aslo...if Telangana is Declared....There is more chances to declare TG state

    ReplyDelete
  2. ముందు శభాష్ శ్రీకృష్ణకమిటీ అన్నారు, తర్వాత ఆ కమిటీ నే తిట్టారు ఆంధ్రా మంత్రులు.

    ఇప్పుడు శభాష్ డీజీపీ అంటున్నారు, రేపు వీపులు వాయగొడుతుంటే అప్పుడేమంటారో.

    ReplyDelete
  3. డిజిపి మాటలకే తెలబాన్లు నిక్కర్లు తడుపుకోవడం పాపమనిపించింది. :)) ఇలాగైతే 250రూ ఇచ్చినా మీటింగుకి జనాలు దొరికేది అనుమానమే! గాడిదల్లా గర్జన చేసి ఎవడు గొంతు బొంగురుపోయేలా చేసుకుంటాడు?

    ReplyDelete
  4. @శ్రీకాంతాచారి:శ్రీ క్రిష్ణ కమిటీని ఫాల్తూ కమిటీ అనీ, గడ్డి పీకుతుందా అని నోరు పారేసుకున్నది ఎవరో అందరికీ తెలుసు. మళ్ళీ వారే అదే కమిటీకి నివేదికలు ఇచ్చి..ఇప్పుడు తెలంగాణా రాక పోతే ప్రజలు వీపులు వాయగొడతారన్న భయంతోనే ఈ గర్జనలు, గాండ్రింపులు చేస్తున్నారని జనం ఎప్పుడో కని పెట్టేశారు.

    ReplyDelete
  5. ఎవరు ఎక్కడ ఏం మాట్లాడినా భుజాలు తడుముకుని ఉలిక్కపడటం తెలబాన్లకు అలవాటైపోయిందిలే, ఎవరూ వాళ్లను పట్టించుకోడం లేదు! పాపం, పోనీండి, ఎలాగూ తెలంగాణా వచ్చేది లేదన్నట్లుగానే శ్రీకృష్ణ కమిటీ సూచన ప్రాయంగా చెప్పనే చెప్పింది. అందుకే ఉద్యమాన్ని సజీవంగా ఉంచుతున్నామన్న అపోహ జనంలో కల్గించడానికే ఈ గర్జనలూ వగైరాలు! లోపల వణికి చస్తూనే పైకి మేకపోతు గాంభీర్యం వెలగబెడుతున్నారు.

    ReplyDelete