Monday, February 28, 2011

తెలంగాణా గోల తప్ప ప్రజల గోడు పట్టదా?

పని చేయని ప్రభుత్వోద్యోగులు + పరీక్షలు రాయని విద్యార్ధులు + స్వార్ధ రాజకీయాల కోసం దొంగ ఉద్యమాలు చేసే తెలబాన్ గుంపులు + చేత గాక చోద్యం చూసే ప్రభుత్వం ..... వీరందరి మధ్య సామాన్య మధ్య తరగతి /బడుగు జీవుల సమస్యల గురించి ఆలోచించే వాడెవడైనా వున్నాడా? అసలు ప్రత్యెక రాష్ట్రం వచ్చినంత మాత్రాన ఉద్యోగులకి, విద్యార్ధులకి ఒరిగేదేమిటి? పరీక్షలు బహిష్కరించమని రెచ్చగొడుతున్న ప్రొఫెసర్ కి జీతంలో ఒక్క రూపాయి కూడా నష్టం వుండదు. కానీ  నష్ట పోతున్న విద్యా సంవత్సరం గురించిన ఆలోచన రోడ్డెక్కుతున్న విద్యార్ధులకి ఉండద్దా?  వుద్యోగులైనా అంతే! ప్రత్యెక రాష్ట్రం వస్తే స్పెషల్ ఇంక్రిమెంట్ అని తెలబాన్ దొర చెప్పగానే పనులు మానేసి రోడ్ల మీదకి వచ్చేయటమే! డ్యూటీ చేయని ఉద్యోగుల పై శాఖా పరమైన చర్యలు ప్రభుత్వం మొదటి రోజే తీసుకొని వుంటే విషయం ఇంత ముదిరేది కాదు.  పని చేయని వారి పై చర్య తీసుకోవటం వేధింపు చర్య కానే కాదు.  ప్రభుత్వం తక్షణం అలసత్వాన్ని వీడి పాలనా యంత్రాంగాన్ని పట్టాలెక్కించాలి. అలాగే రైల్ రోకో పేరు మీద పట్టాలెక్కటానికి సిద్ధమవుతున్న వారిని అదుపు చేయాల్సింది పోయి రైల్వే శాఖ ముందుగానే రైళ్ళని రద్దు చేయటం చాల దారుణం. ఏతా వాతా తేలేదేమంటే సామాన్య ప్రజల ఇక్కట్లనేవి ప్రభుత్వానికి ఏ మాత్రం పట్టట్లేదని.... ప్రశాంత జీవన పరిస్థితులకి  పాడె   కట్టి వూరేగిస్తున్న తెలబాన్ గుంపుల అక్రుత్యాలని అడ్డుకోలేని పక్షంలో తక్షణం ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించాలి. 

6 comments:

  1. Ayya akasa ramanna garu. Bagundhi article. baga chepparu kaani telabaan padaanni prayoginchina meeku telangana prajala meedha unna abhiprayanni chebuthundhi. Telangana ante KCR kadhu ani meeru telusukondi.

    ReplyDelete
  2. మీరు నమ్ముతారో లేదో నాకు తెలీదు. జగన్ ని ఎలా ఓవర్‌షాడో చేయాలా అని ఆలోచిస్తున్న కాంగ్రెసే - అతను ఏదో ఒక రకంగా లైమ్‌లైట్ లోకి వస్తాడనుకున్నప్పుడల్లా అతన్నుంచి దృష్టి మళ్ళించడం కోసం ఈ తెలంగాణ తురుపుముక్కని బయటికి తీస్తోంది. అందుకోసం తెలంగాణ జె.ఏ.సి.నీ, కేసీయర్‌నీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేల్నీ, ఎంపీల్నీ వాడుకుంటోంది. పైకి తాను నిస్సహాయత నటిస్తోంది.

    మీరు జాగ్రత్తగా గమనిస్తే జగన్ ఫీజుల రీ-ఇంబర్సుమెంటు గురించి దీక్షలో కూర్చున్నప్పటి నుంచీ ఈ సహాయ నిరాకరణ మొదలైంది. అతను దీక్షలోంచి లేచినాక తీవ్రత తగ్గుముఖం పడుతోంది. జగన్ మార్చిలో పార్టీ పెట్టబోతున్నాడు. మళ్ళీ దాన్నుంచి దృష్టి మళ్ళించడం కోసం కేసీయార్ చేత "పల్లె-పల్లె పట్టాల పైకి" అనే సరికొత్త ఉద్యమం చేయిస్తున్నారు. "శ్రీకృష్ణ కమిటీ తెలంగాణకి సిఫారసు చేయకపోతే జనవరిలో అగ్నిగుండాలు సృష్టిస్తా, అదీ, ఇదీ" అని కూసిన కేసీయార్ కాంగ్రెస్ దగ్గర రు.350 కోట్లు తీసుకొని గమ్మునున్నాడు. అలాంటివాడు తెలంగాణ తెస్తాడని ఈ తెలంగాణ పిచ్చోళ్ళు నమ్ముతున్నారు.

    ఒక్క వ్యక్తిని ఎదుర్కోవడం కోసం ఒక రాష్ట్రాన్ని శాశ్వతంగా నాశనం చేసిపారేస్తోంది కాంగ్రెస్. ఇంతగా వీళ్ళు జగన్ ని చూసి భయపడుతున్నారంటే ఖచ్చితంగా వీళ్ళేదో తప్పు చేశారు చనిపోయిన వై.ఎస్. విషయంలో ! అతని కొడుక్కి ఆ వివరాలు తెలుసనీ, అతను అధికారంలోకి వస్తే అవన్నీ బయటికొస్తాయనీ భయంతో వణికి చస్తున్నారు. ఈ రోజు మేధావివర్గానికి చెందిన మనం ఈ సంగతి గ్రహించాం. కానీ రేపు సామాన్యప్రజలు కూడా గ్రహిస్తారు.

    ReplyDelete
  3. @Anonymous above at 10:58 PM :
    తెలబాన్ పదాన్ని ఎందుకు ప్రయోగిస్తున్నామో, ఇంకా తెలంగాణా సామాన్య ప్రజల మీద నా అభిప్రాయం ఇక్కడ చదవండి.
    http://andhraaakasaramanna.blogspot.com/2011/01/blog-post_20.html

    ReplyDelete
  4. ఈ రోజు మేధావివర్గానికి చెందిన మనం ఈ సంగతి గ్రహించాం.

    నువ్వు మేధావివా? LOL.

    ReplyDelete
  5. alagantara.. ajaakarlura...

    telangana prajalu anni kastallu paduthunna mari endhuku bayatiki vasthunnaro telusuko ajaakar medhavi..

    ReplyDelete
  6. జై తెలంగాణా...!
    జై జై తెలంగాణా ...!!

    జోర్‌ సే బోలో... ప్యార్‌ సే బోలో...
    జై తెలంగాణా... జై తెలంగాణా...!

    మా నీళ్లు ... మాకు గావాలె.
    మా ఉద్యోగాలు ... మాకు గావాలె !!
    మా నిధులు ... మాకు గావాలె !!
    మా తెలంగాణా ... మాకు గావాలె !!!!!

    ఔర్‌ ఏక్‌ ధక్కా........ తెలంగాణా పక్కా...!

    ఆగదు ఆగదు ఆగదు తెలంగాణా పోరు ఆగదు
    సాగదు సాగదు సాగదు ఆంధ్రోళ్ల పాలన ఇక సాగదు

    వాడెవ్వడు వీడెవ్వడు...? తెలంగాణాకు అడ్డెవ్వడు...??
    తెలంగాణాకు అడ్డొస్తే ... అడ్డంగా నరికేస్తాం...!!

    జోహార్‌ తెలంగాణా విద్యార్థి అమరవీరులకు..
    జోహార్‌ జోహార్‌!

    ReplyDelete