Wednesday, September 28, 2011

పిట్ట కదల పిట్టల దొర!

తెలబాన్ దొర రెండు వారాల్లో తెలంగాణా అని ప్రకటించి రెండు నెలలు గడిచి పోయింది. మరి ఈ రెండు నెలల్లో తెలంగాణా ఎందుకు రాలేదో వివరించాల్సింది పోయి, ఈ రోజు మరో పిట్ట కధ  వినిపించారు.  అనంతపూర్, కర్నూల్ ల తో కలిపిన తెలంగాణా వస్తుందట! అదీ కేంద్రం అసదుద్దీన్ తో రాయబారం చేసిందట!  ఎవరిని ఏమార్చటానికి ఈ పిట్ట కధలు చెప్తాడో తెలీదు. తమది సమైక్య వాదమే అని కుండ బద్దలు కొట్టిన మజ్లిస్ నాయకునితో రాష్ట్ర విభజన కోసం కేంద్రం ఎలా రాయబారం పంపుతుందో బుర్రలో గుజ్జు ఉన్న వారెవరికీ అర్ధం కాదు.   తెలబాన్ నాయకునితో తాను రాష్ట్ర విభజన విషయం చర్చించనే లేదని అసదుద్దీన్ ఆ తరువాత ఖండించటం కొస మెరుపు.  కల్ల బొల్లి కబుర్లు చెప్పినట్లు ఋజువు అయ్యాక కూడా సిగ్గుతో తల దించుకోకుండా... తల తెగి పడ్డా సరే, తల లేని (హైదరాబాద్) తెలంగాణా ఒప్పుకోం అంటూ బీరాలు పలకటం కామెడీ గాక మరేమిటి??   ఇటువంటి పొలిటికల్ బఫూన్ ల సారధ్యంలో అలజడి చేస్తున్న అమాయక తెలంగాణా ప్రాంత ప్రజలని చూసి జాలి పడటం తప్ప మరేమీ చేయలేం.

3 comments:

  1. సచార్‌ కమిటీ కోసమే కలిశా : ఓవైసీ
    హైదరాబాద్‌ : సచార్‌ కమిటీ కోసమే తాను టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను, టీడీపీ అధినేత చంద్రబాబును కలిశానని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ పేర్కొన్నారు. కేసీఆర్‌ వద్ద తాను తెలంగాణ, హైదరాబాద్‌ల గురించి ప్రస్తావించలేదని ఆయన తెలిపారు. రేపు జగన్‌ను కూడా సచార్‌ కోసమే కలుస్తున్నాని ఆయన స్పష్టం చేశారు.
    http://www.suryaa.com/main/showNews.asp?cat=1&subCat=1&ContentId=49623

    వినేవాడు వెధవైతే..హరికధ ఇంగ్లీష్ లో చెప్తానన్నాడట..వెనుకటికెవరో తెలబానుడు...

    ReplyDelete
  2. ఏందీ లొల్లి ???
    ఇప్పుడే కేంద్రం టి. జి. వెంకటేష్ ని కూడా రాయబారం పంపిందాయె !
    ఆ పిట్ట కథ ... క్షమించాలి, పచ్చి నిజాన్ని కూడా మీరిలానే వెక్కిరిస్తారా ?
    ఐనా ఈ నిజాలన్నీ మీకోసం కాదని మీకు మాత్రం తెలీదా ?

    ReplyDelete
  3. చిత్తశుద్ది లేని నాయకులున్న ఉద్యమమేదయినా,కుక్కలు చింపిన విస్తర

    ReplyDelete