Monday, July 5, 2010

వేర్పాటు వాదులకు బుధ్ధి చెప్పాలి!

2009 సార్వత్రిక ఎన్నికలలొ సమైక్య వాదానికి కట్టుబడి ఒంటరిగా రాజ శేఖర రెడ్డి ఒక వైపు, తెలంగాణాకి సై అని మహా కూటమి మరొ వైపు మోహరించి పొరాడిన విషయం తెలిసిందే.  అటువంటి ఎన్నికల సమరంలొ ప్రజలు ఇక్కడ వై.ఎస్. ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఇవ్వటంతొ బాటు కెంద్రంలొ యూ.పీ.ఎ. ప్రభుత్వానికి కూడ 33 మంది ఎం.పీ. లని అందించారు. దీన్ని బట్టి ప్రజల మాండేటు సమైక్య వాదమే అన్నది అప్పుడె ఋజువై పొయింది. బలవంతుడైన వై.ఎస్. ని ఎదుర్కొవడం చెత గాక మూలన కూర్చున్న కే.సీ.ఆర్., ఆయన అకాల మరణం తరువాత మళ్ళీ తన వునికిని చాటుకొవటానికి తెలంగాణా వుద్యమాన్ని తలకెత్తుకున్నాడు. తదనంతర పరిణామాల్లొ తాను, తన చెల్లి మాత్రం పదవులు అంటి పెట్టుకొని సహచరులందరి చేత రాజీనామాలు చెయించి ప్రజల నెత్తిన బలవంతంగా వుప ఎన్నికలని రుద్దాడు. ఇవి ఖచ్చితంగా ప్రజలు కొరుకున్న ఎన్నికలు కావు. వారిపై బలవంతంగా రుద్ద బడిన ఎన్నికలు మాత్రమె. అయినా రాజీనామా చేసిన వారే మళ్ళీ పొటీ చేసి గెలిస్తే వారు చేసిన త్యాగం ఎమిటొ బోధ పడదు. తెలంగాణా వుద్యమంలొ ప్రాణాలు కొల్పోయిన వారి సన్నిహిత బంధువులని ఈ ఎన్నికల్లొ నిలబెట్టక పోగా, కనీసం ఇప్పుడు ఆ ప్రస్తావన కూడా ఎవరూ తీసుకు రావట్లేదంటె తెలంగాణ పట్ల వారి చిత్త శుధ్ధి  ఏ పాటిదొ చెప్పకనే చెబుతోంది. కనుక ప్రజలు తమకు అనుకొకుండా వచ్చిన ఈ అవకాశాన్ని వుపయోగించి, వేర్పాటు వాదుల డ్రామాలు మరింక కొన సాగకుండా తీర్పు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

16 comments:

  1. గాడిద గుడ్డేం గాదు. ఎవడు డబ్బులు ఎక్కువ విరజిమ్మితే వాడే రాజు, అప్పుడు రెడ్డి గారు విరజిమ్మారు, ఇప్పుడు ఎవరో.

    ReplyDelete
  2. మొట్ట మొదటి వాక్యమే తప్పు... రాజశేఖర రెడ్డి నాది సమైక్య వాదం అని ఎన్నికలకు ముందు ఎప్పుడైనా చెప్పాడా... ఇప్పుడున్న తెలంగాణ కాంగ్రెస్ తెలుగు దేశం వాళ్ళు ఎమైనా చెప్పారా.. ?

    వాళ్ళు అలా మొహరించి పోరాడారా ? ఇలా నిస్సిగ్గుగా వ్రాయటానికి నీకు చేతులెలా వచ్చాయి... ఆంధ్రా వారి గారడి బుద్ది మరో సారి బయట పెట్టావు...

    ReplyDelete
  3. పైన Krishna, మరీ అలా తెలబానులు లాగా రెచ్చిపోకండి :))

    1. ఎన్నికలప్పుడు, చనిపోయిన దేముడు (తెలంగాణాలో పోలింగ్ అయినతర్వాత), మహాకూటమికి ఓటు వేయటమంటే, సెపరేట్ కు ఓటువేయటమే, మీకు visa లు గట్రా అవసరం రావచ్చు అని కోస్తా లో అన్నమాట నిజం కాదా?. దాని అర్ధం ఏమిటి? ఆయన తనకు అనుకూలంగా తెలంగాణాలో ఎన్నికలు అయినతర్వాత అన్నా, ఆ మాట అన్నడా లేదా? అది కోస్తా ప్రాంతంలో ఎంతో కొంత పనిచేసిందా లేదా? అంతేకాదు, ఎన్నికలలో గెల్చిన తర్వాత సెపరేట్ వాదుల గురించి ఆయన అన్న మాటలు మరచిపోకండి!!

    2. ఆంధ్రా వారి గారడీ బుద్ది అని అంటూ, మీరు బయటపెట్టుకొంటున్న బుద్ది ఏంటి? ఆ గారడీ కి పడిపోయి, "నీ బాంచన్" అనే బుద్దా? అయినా ముక్కు దొరకు "నీ కాల్మొక్కుతా" అని వెళ్లి దండం పెట్టటంలో బిజీ గా ఉండక, ఏంది ఈ లొల్లి? అసలు మీరు తెలంగాణా వాళ్లేనా?

    ఇక టపాకు వస్తే, "ఒరేమునా" కామెంట్ తో ఏకీభవిస్తున్నా? జనాలు ఓట్లు వేసింది, వేసేది డబ్బులు, మందు కు కాని, గాడిద గుడ్డు తెలంగాణాకో, ఇంకోదానికో కాదు. కాకపోతే గట్టి (దగ్గర) పోటీ ఉన్న చోట్ల, ఈ వాదనలు ఎంతో కొంత ప్రభావం చూపిస్తాయి, అంతే!!

    ReplyDelete
  4. నేను రెండవకృష్ణుడితో ఏకీభవించి, మొదటికృష్ణుడికి మద్దతు వ్యూహాత్మక మద్దతు మౌనం ఇస్తున్నాను. ఆ ఫ్యాక్షన్ అవినీతి పరుడిని తీసేస్తే , ఆకాశ్ చెప్పింది నిజమే అనిపిస్తోంది. ఫ్యాక్షనిస్టులకు తన వాళ్ళనే వుండరు, ఇక రాష్ట్రం గురించి ఆలోచించే తీరిక ఎక్కడిది? తెలంగాణాలో భూములు అమ్ముకునే దాకా ఐనా విడిపోకూడదని వుద్దేశ్యం అయ్యుంటుంది.

    ReplyDelete
  5. ఎంత బరి తెగింపు.... ఎన్నికలయ్యాక సమైక్యవాదం చెప్పడం.. ఎన్నికలప్పుడు సమైక్య వాదం చెప్పడం ఒకటేనా ?

    మీది అవిజ్ఞతో లేక... కింద పడ్డా నాదే పై చేయి అంటున్న నీతో మాటలు అనవసరం....

    ReplyDelete
  6. @ క్రిష్ణ,
    "ఎన్నికలయ్యాక సమైక్యవాదం చెప్పడం.. ఎన్నికలప్పుడు సమైక్య వాదం చెప్పడం ఒకటేనా ?"
    కాదు, కాకపోతే దేముడు గారు చెప్పింది ఎన్నికల (ఆంధ్రప్రదేశ్) ప్రచారం లోనే!!! ఎన్నికలు పూర్తి కాకముందే, కాకపోతే ఉహ్యాత్మకంగా, అచ్చు రాజకీయవాదిలాగా, తెలంగాణా లో పోలింగ్ అయినాకమాత్రమే, మిగతా చోట్ల పోలింగ్ కాకముందే చెప్పాడు దేముడు గారు :))


    ఇందులో క్రింద, పైన పడే మాటలు ఎందుకు? మీరు కింద పడ్డా, నేను పైన పడినా, సెజ్ లపేరుతోనో, ధనయఙ్నం పేరుతోనో దోచుకొన్న దొరలు, లేక తెలంగాణా భవన్లో కూకొని మామూళ్ళు వసూళ్ళు చేస్తున్న దొరో, మీకు గాని, నాకు గాని ఓ పైసా అయినా ఇస్తారా? లేక సామాన్యుల బతుకు బాగుచేస్తారా? ఆ రకంగా అందరము కిందపడిన వాళ్లమే!!

    ఇక బరితెగింపు కేముంది, తాను మాత్రం దొంగ రాజీనామా చేసి, మిగతా వారితో అసలు "నామాలు" చేయించి, పైన రాజీనామాలు చేయని వాళ్లను ఊళ్లలోకి రానీయకండి అని చెప్పే మీ దొర మరియు తెలంగాణా గాంధీ తో పోలిస్తే, ఎవరి బఱితెగింపు అయినా ఏమిలెక్క? :))

    ReplyDelete
  7. @ క్రిష్ణ,
    "ఎన్నికలయ్యాక సమైక్యవాదం చెప్పడం.. ఎన్నికలప్పుడు సమైక్య వాదం చెప్పడం ఒకటేనా ?"
    కాదు, కాకపోతే దేముడు గారు చెప్పింది ఎన్నికల (ఆంధ్రప్రదేశ్) ప్రచారం లోనే!!! ఎన్నికలు పూర్తి కాకముందే, కాకపోతే ఉహ్యాత్మకంగా, అచ్చు రాజకీయవాదిలాగా, తెలంగాణా లో పోలింగ్ అయినాకమాత్రమే, మిగతా చోట్ల పోలింగ్ కాకముందే చెప్పాడు దేముడు గారు :))


    ఇందులో క్రింద, పైన పడే మాటలు ఎందుకు? మీరు కింద పడ్డా, నేను పైన పడినా, సెజ్ లపేరుతోనో, ధనయఙ్నం పేరుతోనో దోచుకొన్న దొరలు, లేక తెలంగాణా భవన్లో కూకొని మామూళ్ళు వసూళ్ళు చేస్తున్న దొరో, మీకు గాని, నాకు గాని ఓ పైసా అయినా ఇస్తారా? లేక సామాన్యుల బతుకు బాగుచేస్తారా? ఆ రకంగా అందరము కిందపడిన వాళ్లమే!!

    ఇక బరితెగింపు కేముంది, తాను మాత్రం దొంగ రాజీనామా చేసి, మిగతా వారితో అసలు "నామాలు" చేయించి, పైన రాజీనామాలు చేయని వాళ్లను ఊళ్లలోకి రానీయకండి అని చెప్పే మీ దొర మరియు తెలంగాణా గాంధీ తో పోలిస్తే, ఎవరి బఱితెగింపు అయినా ఏమిలెక్క? :))

    ReplyDelete
  8. రాజశేఖరరెడ్డి తను సమైఖ్య వాదినని ఎన్నికలలో చెప్పకున్నా ,టి.ఆర్.ఎస్.,వాళ్ళు కె.సి.ఆర్ మాత్రం రాజశేఖరరెడ్డి కి ఓటు వేస్తే తెలంగాణా రాష్ట్రం రాదని తెలంగాణాకు రాజశేఖరరెడ్డే ప్రధాన మైన అడ్డంకని విపరీతంగా ప్రచారం చేసినారు.అయినా కూడా రాజశేఖర రెడ్డినే తిరిగి గెలిపించినారు.దీన్ని బట్టి చూస్తే తెలంగాణా ప్రజలు వేర్పాటు వాదం వైపు లేరనే సత్యం తెలుస్తుంది.

    ReplyDelete
  9. "...అనుకొకుండా వచ్చిన ఈ అవకాశాన్ని వుపయోగించి, వేర్పాటు వాదుల డ్రామాలు మరింక కొన సాగకుండా తీర్పు చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.>>>>
    వేర్పాటు వాదుల డ్రామాలు...

    ఏ వేర్పాటు వాదుల డ్రామాలు గురించి మీరు మాట్లాడేది.?

    తెలంగాణా లో కాంగ్రెస్స్" తెలంగాణా ఇచ్చేది మేమే... తెచ్చేది మేమే " అని నినాదం చేస్తోంది.
    శ్రీ కృష్ణ కమిటీ కి తెలంగాణా కాంగ్రెస్స్ నాయకులంతా కట్టగట్టుకుని వెళ్లి గట్టిగా తెలంగాణా వాదం వినిపిస్తున్నారు.

    తెలంగాణా టీడీపీ నాయకులదీ అదే వాదం. తెలుగు దేశం పార్టీ ప్రణబ్ ముఖర్జీ కమిటీ కి ఇచ్చిన లేఖకు కట్టుబడి వున్నాం అంటుంది.

    మరి తెలంగాణా లో ఇప్పుడు ఎన్నికల బరిలో దిగిన వాళ్ళ లో వేర్పాటు వాదులు కాని వాళ్ళు ఎవరు?

    సమైక్య అరుపులు మీ ఆంధ్రా లోనే.... తెలంగాణా లో వినపడవు.

    కాబట్టి ..."అనుకొకుండా వచ్చిన ఈ అవకాశాన్ని " ధైర్యంగా సూటిగా నిజాయితీ గా జై సమైక్యాంధ్ర అంటూ వినియోగించు కోడానికి ఇక్కడ ఎవరూ లేరు...!!

    ముందు అది గ్రహించండి.
    -యుగంధర్

    ReplyDelete
  10. రాజశేఖరరెడ్డి గారు సమైఖ్యవాదినని ఆయన నోటితో ఎప్పుడూ చెప్పలేదు,కానీ టి.ఆర్.ఎస్. వాళ్ళు మరియు కె.సి.ఆర్ తెలంగాణాకు రాజశేఖరరెడ్డి మాత్రమే అడ్డమని విపరీతంగా ప్రచారం చేసినారు ,అయినా కానీ తెలంగాణా ప్రజలు మాత్రం రాజశేఖరరెడ్డినే ఆదరించినారు.వేర్పాటు వాదులు మహాకూటముల ద్వారా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

    ReplyDelete
  11. This comment has been removed by the author.

    ReplyDelete
  12. రాజశేఖరరెడ్డి గారు సమైఖ్యవాదినని ఆయన నోటితో ఎప్పుడూ చెప్పలేదు,కానీ టి.ఆర్.ఎస్. వాళ్ళు మరియు కె.సి.ఆర్ తెలంగాణాకు రాజశేఖరరెడ్డి మాత్రమే అడ్డమని విపరీతంగా ప్రచారం చేసినారు ,అయినా కానీ తెలంగాణా ప్రజలు మాత్రం రాజశేఖరరెడ్డినే ఆదరించినారు.వేర్పాటు వాదులు మహాకూటముల ద్వారా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

    ReplyDelete
  13. రాజశేఖరరెడ్డి గారు సమైఖ్యవాదినని ఆయన నోటితో ఎప్పుడూ చెప్పలేదు,కానీ టి.ఆర్.ఎస్. వాళ్ళు మరియు కె.సి.ఆర్ తెలంగాణాకు రాజశేఖరరెడ్డి మాత్రమే అడ్డమని విపరీతంగా ప్రచారం చేసినారు ,అయినా కానీ తెలంగాణా ప్రజలు మాత్రం రాజశేఖరరెడ్డినే ఆదరించినారు.వేర్పాటు వాదులు మహాకూటముల ద్వారా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

    ReplyDelete
  14. రాజశేఖరరెడ్డి గారు సమైఖ్యవాదినని ఆయన నోటితో ఎప్పుడూ చెప్పలేదు,కానీ టి.ఆర్.ఎస్. వాళ్ళు మరియు కె.సి.ఆర్ తెలంగాణాకు రాజశేఖరరెడ్డి మాత్రమే అడ్డమని విపరీతంగా ప్రచారం చేసినారు ,అయినా కానీ తెలంగాణా ప్రజలు మాత్రం రాజశేఖరరెడ్డినే ఆదరించినారు.వేర్పాటు వాదులు మహాకూటముల ద్వారా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

    ReplyDelete
  15. ## రాజశేఖరరెడ్డి గారు సమైఖ్యవాదినని ఆయన నోటితో ఎప్పుడూ చెప్పలేదు##

    మరి దేనితో చెప్పారు? :P

    ReplyDelete