Thursday, October 31, 2013

వేర్పాటు (తీవ్ర) వాదం !


వేర్పాటు వాదుల ఆగడాలు శృతి  మించుతున్నాయి.  వేర్పాటువాదం కాస్తా తీవ్ర వాదం గా పరిణమిస్తోంది. ఖమ్మం, నల్గొండ జిల్లాల పర్యటనకి వెళ్ళిన వైఎస్ఆర్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు విజయమ్మని  వేర్పాటు వాదులు ఆటకాయించటం సహించరానిది.     మన ప్రజాస్వామ్య దేశంలో ఏ మనిషికి గానీ, పార్టీ కి గాని స్వంత అభిప్రాయం ఏర్పరచుకునే హక్కు వుంది.  సమైక్య వాదాన్ని సమర్ధించినంత మాత్రం చేత తెలంగాణా లో తిరగరాదనటం  ఖచ్చితంగా మూర్ఖత్వమే.  సమైక్య వాదాన్ని సమర్ధించే పార్టీ అధ్యక్షురాలికి తెలంగాణా లో తిరిగే నైతిక హక్కు లేదని తెరాస నాయకులు ప్రకటించటం అర్ధ రహితం. తెలంగాణా ప్రాంతాన్ని స్వంత జాగీరు క్రింద జమ కట్టిన రీతిలో సమైక్య వాదులు వస్తే అడ్డుకుంటామని హెచ్చరించటం దేశ  సార్వ భౌమత్వాన్ని సవాల్ చేయటమే !  రాష్ట్రం రాక ముందే ఇంతగా చెలరేగి పోతున్న వారికి ఇంక ప్రత్యెక రాష్ట్రం ఇస్తే పట్ట పగ్గాలుంటాయా ? ఒక పార్టీ నాయకురాలుగా వరద బాధితులని పరామర్శించటానికి వచ్చినంత మాత్రాన తెలంగాణా వాదానికి వచ్చిన ముప్పు ఏమిటి ?   దయ్యాలు వేదాలు వల్లించిన విధంగా భారత దేశం లో ఎవ్వరైనా ఎక్కడైనా ప్రశాంతంగా జీవించ వచ్చంటూ నీతి  వాక్యాలు చెప్పే తెలబాన్లు కనీసం తెలంగాణా లో విజయమ్మ పర్యటనని సైతం సహించలేక పొతున్నారు.  నిజానికి హైదరాబాదు నగరంలోనే కాక తెలంగాణా జిల్లాలలో  కూడా సమైక్య రాష్ట్రాన్ని కోరుకొనే ప్రజలు చాలా మంది వున్నారని శ్రీ కృష్ణ కమిటీ తన నివేదిక లో స్పష్టం చేసింది.  అయితే ఇటువంటి వేర్పాటు వాదుల ఆగడాలకి జడిసి దిన దిన గండంగా బతుకు వెళ్ళ దీస్తున్న వారికి - ఇటువంటి అరాచక ప్రవర్తనల వల్ల భరోసా ఎక్కడ వస్తుంది ?  ఒక పార్టీ అధ్యక్షురాలి ఒక్క రోజు పర్యటనకే భద్రత కల్పించ లేక చేతులెత్తేసిన పోలీసు రక్షణ వ్యవస్థ  ఇక సామాన్య ప్రజల కి ఏమి రక్షణ కల్పిస్తుంది ?  ముఖ్యమంత్రి నే కర్రీ పాయింటు పెట్టుకోమన్న వారు సామాన్య పౌరులకి ఏ గతి పట్టిస్తారు ?     

8 comments:

  1. ఏందయ్య నీ గొడవ, రోజూ ఓ టపా తెలుగులో రాస్తావే, మొన్నే ఎక్కడో చదివాను నాకు తెలిసిన తెలుగు పదాలన్నీ తెలంగాణావాళ్ళవేనట, అది తెలియకుండా మా గుంటూరు జిల్లా వాళ్ళం ఎప్పటినుంచో వాడేస్తున్నాం. రెపో ఎల్లుండో కొత్త ఉద్యమం కుడా వస్తుంది, మా పదాలని కుడా దోచుకున్నారు ప్యాకేజీ కావల్సిందే, స్కైబాబాకి పద్మశ్రీ ఇవ్వాల్సిందే అని. ఇట్టా టపాలు రాస్తా పొతే నిన్ను కుడా పన్ను కట్టమంటారు.

    ఇదంతా ఇప్పటిది కాదులే, ఎప్పటినుండో ఉన్నదే. అసలు మనం వ్యాపారస్తులని వ్యాపారస్తులాగా చుస్తామా? ఎప్పుడూ ఈ కమ్యూనిష్టోల్లు చెవిలో ఇల్లు కట్టుకొని మరీ చెప్పీ చెప్పీ వ్యపారస్తుడు అంటే ఒక మోసగాడు అన్న ఒక భావన కలిగించారు జనాలకి. రైతులు అమాయకులు, ఉద్యోగులు ఎదో పొట్టకూటికోసం కష్టపడేవాళ్ళు. కానీ వ్యాపారస్తులు లేకపోతే అసలు దేశం నడుస్తుందా? మనం ఒప్పుకోము, వ్యాపారస్తులు అంటే దోపిడీదారులు, మోసగాళ్ళు. ఇప్పుడు ఇదే ముదిరింది, అదే కమ్యూనిష్టు ఫిలాసఫీ, ఎంత ముదిరిందీ అంటే, న్యాయంగా రూపాయి రూపాయి పోగేసుకోని స్థలం కొనుక్కున్న సామాన్య ప్రజలు కబ్జాదారులు, రేపు వీళ్ళని తన్ని తరిమేసి, అవి అనుభవిస్తే వాళ్ళు హీరోలు. అసలు హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అందరూ కోస్తా-సీమ వాళ్ళేనా? వీళ్ళు చట్టవ్యతిరేకంగా స్థలాలు పోందితే కోర్టుల్లో కేసులు వేయొచ్చుగా? కోస్తా-సీమ వాళ్ళని తరిమేస్తే అది అంతటితో ఆగుతుందా? తరువాత అది తిరిగి తిరిగి సామాన్య ప్రజలందరినీ పీడిస్తుంది.



    ReplyDelete
    Replies
    1. @ తార గారు,
      మీరన్నట్లు కొత్త ఉద్యమం రావాల్సి వుంది. అయితే భాష కోసం కాదు. మన గుంటూరు జిల్లాకి ప్రత్యెక రాష్ట్రం కావాలని నేను 2011 లోనే అడిగాను.
      http://andhraaakasaramanna.blogspot.in/2011/11/grs.html
      అప్పుడు నా వేదన అరణ్య రోదన గానే మిగిలి పోయింది తప్ప ఎవరూ పట్టించుకొలెదు. ఇప్పుడు కేంద్రం తెలంగాణా ఇవ్వడానికి ప్రదర్శిస్తున్న దూకుడు చూస్తుంటే మళ్ళీ కొద్దిగా ఆశ చిగురిస్తోంది. మరి గుంటూరు రాష్ట్రం కోసం ఉద్యమిద్దామా ?

      Delete
  2. బొత్స, హర్షకుమార్లమీద దాడి చేసినప్పుడు ఏడ దాగినవే రామన్నా?

    ReplyDelete
  3. భలే ఓడివే ! గుంటురు ప్రత్యేక రాష్ట్రంగా వాలా? మరైతే మా నెల్లురు ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి. తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జతి మనది పాటలో తెలంగాణా కవి సర్కారు నాది, రాయలసీమ నాది, తెలంగాణా నాది, నెల్లూరు నాది అని చెపుతాడు. అన్ని ప్రాంతాల మధ్య మా నెల్లూరు ఒక్కటే ప్రత్యేకతను నిలబెట్టుకొంది. మా యాసవేర. మీతొ మేము కలసి ఉండం.

    ReplyDelete
  4. నాది అనంతపురం లో ఒక పల్లె. మా ఊరికి మా పక్కూరికి కూడా కొన్ని పదాల వాడకం లో తేడా ఉంది. నాక్కూడా ఒక దేశం కావాలి మరి. పైగా పక్కూరిలో చెరువు ఉంది దానికి నీళ్లన్నీ మా ఊరి వంక గుండా నే వెళ్తాయి. మేము ఎంత నష్టపోయాము?

    ReplyDelete
  5. maa telangana udyamanni verpatuvam ani,thivravadam ani antunnavu, mari meeru madras nundi vidipovataniki chesina udyamam enti babu adi thivravame nee lekka prakaram. aite mee andrulu thivravadulu ani oppukuntava!

    ReplyDelete
  6. deshamlo mottamodati verpatuvaadulu andhrule! vallu nerpina teevravaadame idi. vaallu cheste shringaaram .... itarulu cheste vyabhichaaram .... siggu leni janmalu!

    ReplyDelete
  7. ori telaban VISHAACHI, anything you have to learn from the Andhras. You are lazy, gudmba, gochi people.And now it is clear who has developed the junk city into modern Hyderabad.

    sankar

    ReplyDelete