Thursday, February 13, 2014

పెప్పర్ స్ప్రే మారణాయుధం కాదు !

రాష్ట్ర విభజన విషయంలో మొదటి ప్రక్రియ నుండి తొండి  ఆడుతున్న కేంద్రం చివరికి పార్లమెంటులో బిల్లు ప్రవేశ పెట్టె విషయంలో కూడా అదే ఆట కొన సాగిస్తోంది.   పార్లమెంటులో బిల్లుని గెలిపించుకుంటామన్న నమ్మకం లేక, కనీసం బిల్లుని సజీవంగానైనా  వుంచుదామనె కుట్ర పూరిత ఊహతో దొడ్డి దారిన రాజ్య సభలో ప్రవేశ పెడదామని ప్రయత్నించి భంగ పడింది.  ఇప్పుడు లోక్ సభ వంతు.  తమ ప్రాంత ప్రయోజనాలకి పూర్తి విరుద్ధంగా ఉన్న బిల్లుపై నిరసనలు తెలుపుతున్న సీమాంద్ర సభ్యులని నిలువరించే  కుట్రలో భాగంగా తెలంగాణా ప్రాంత ఎంపీ లతో పాటుగా ఇతర రాష్ట్రాల ఎంపీ లని కూడా  హొమ్ మంత్రి ముందు మొహరింప చేయటమే కాకుండా నిరసన తెలుపటానికి ముందుకి వచ్చిన సీమాంద్ర సభ్యుల పై భౌతిక దాడులకి కూడా తెగ బడే స్థాయికి దిగ జారింది.  మూకుమ్మడిగా ఇతర ప్రాంత/ఇతర రాష్ట్ర సభ్యులు నానా రకాలుగా దూషిస్తూ, దాడి చేస్తుంటే
ఆత్మ రక్షణ కోసం తన దగ్గర అందు బాటులో ఉన్న  పెప్పర్ స్ప్రే  ఉపయోగించ వలసి వచ్చిందని విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజ గోపాల్ తెలియ జేశారు.  ఈ సంఘటన తరువాత ఇతర సభ్యులని లగడపాటి హత్య చెయబొయారని నానా రగడ చేస్తున్న తెలంగాణా సభ్యులు, లోక్ సభ టీవీ దృశ్యాలని బయట పెట్టమని ఎందుకు అడగరు?  ఆ దృశ్యాలు బయట పెడితే దాడికి పాల్పడింది ఎవరో, ఆత్మ రక్షణ చేసుకున్నది ఎవరో తెలిసి పోతుంది కదా! అసలు ఈ రోజు లోక్ సభ వ్యవహారాల చిట్టాలో లేని తెలంగాణా బిల్లు అంశం అనుబంధ అంశం గా హడావిడిగా ప్రవేశ పెట్టాలని చూడటమే కాంగ్రెస్ చేసిన కుట్ర.  ఓ పక్క ప్రతి పక్ష నాయకులైన సుష్మా స్వరాజ్, జగన్ వంటి వారు బిల్లు ప్రవేశ పెట్టబడ లేదని తేల్చి చెపుతుంటే, ఇక ఆ బిల్లు పార్లమెంటు ఆస్తి అని షిండే బుకాయించటం వంచనకి పరాకాష్ట.  
  

11 comments:

  1. but demolishing statues is equivalent to killing

    ReplyDelete
  2. I do not support such insane act by Lagadapati.
    At the same time, I do not support central government dealing this issue in completely wrong way.

    A lesson should be taught to congress and people should eradicate Congress for ever.

    ReplyDelete
    Replies
    1. desaanikadi vadalani sani.
      desaanni mukkalu mukkalu
      chesi gaani vadaladu.

      Delete
  3. తెలంగాణా వాళ్లకు పూర్తి విడిపోవాలనే కోరిక ఉన్నట్లుగానే
    సీమాంధ్ర వాళ్లకు కలిసి ఉండాలనే కోరిక ఉండటంలో తప్పేమిటో ఎవరైనా చెప్పండి.

    లేదు.....కుదరదు...
    సామరస్యంగా పరిష్కరించుకోవాలని ప్రయత్నం చెయ్యాలి గదా - ఆ దిశగా ఆ వైపు
    నుంచి గాని ఈ వైపునుంచి గాని జరిగిన ప్రయత్నం శూన్యం. ఎందరో పెద్దలున్నారు
    ఆ వైపూ ఈ వైపూ.

    నిమిష నిమిషం నోరు తెరిస్తే ఆబద్దాలు చెప్పే షిండే, దిగ్విజయ్ సింగ్ (వీళ్ళ గురించి యెంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది - మనకు, సమాజానికి) -- ఎన్ని జరుగుతున్నా
    చూడని, మాట్లాడని ప్రధాని మరియు రాష్ట్రపతి. ధృతరాష్ట్రుడి గురించి విన్నాం.
    ఇప్పుడు ఇద్దర్ని ఒకేసారి చూస్తున్నాం.
    ఇలాంటి వాళ్లా ఒక విశాలమైన దేశాన్ని పాలించవలసిన వాళ్ళు ?
    ఒకప్పటి తెలుగు ప్రధాని పీవీని యెంత నీచంగా - కనీసం చనిపోయాడనే జ్ఞానం కూడా లేకుండా కాంగ్రెస్ వాళ్ళు ఎంతటి అమర్యాద చూపారో "ఆంధ్రులందరికీ" తెలుసు.
    ఘనత వహించిన దిగ్విజయ్ సింగ్ గారంటారు "పది సంవత్సారాల తరువాత
    తెలంగాణా వాళ్ళు చిన్తిస్తారని నాకు తెలుసు" - మరి ఎవరి మేలు కోసం ఇదంతా?

    నిజం చెప్పాలంటే కాంగ్రెస్ అధికారానికొఛిన మెజారిటీ సార్లు ఆంధ్ర ప్రదేశ్ పున్యాన్నే కాంగ్రెస్
    అధికారం చెలాయించిన్దన్నది సంఖ్యల సాక్ష్యం. ఈ రోజు వరకు ఒక ప్రాముఖ్యత గలిగిన
    మంత్రిగిరి ని తెలుగు వాళ్లకు ఇవ్వలేదనే వాస్తవాన్ని మనమెందుకు గ్రహించలేకపోతున్నాం.
    ఎందుకింత దాసోహ్యమైంది తెలుగు జాతి.

    సోనియా మూకకు తెలంగాణా పై ప్రత్యేకమైన ప్రేమ లేదన్నది ప్రతి తెలంగాణా సోదరుడికీ తెలుసు. కేవలం రాజకీయ లబ్ది తప్ప వేరేవిధమైన తెలంగాణాభివ్రుద్ది కాంక్షా వాళ్ళకు లేదన్నది ప్రతి తెలుగువ్యక్తికీ తెలుసు, తెలంగానానా లేక సీమాంద్రానా అన్నది ప్రక్కన బెడితే - బేసిక్ గా అందరు
    తెలుగు వాళ్ళే కనుక. రేప్రోద్దున ఇంకేదైనా లాభం కోసం తెలంగాణా ను కూడా మోసం చేయరనే
    గ్యారంటీ ఏమైనా ఉందా?

    కాకపోతే మనకు బెనిఫిట్ జరుగుతున్నప్పుడు మనం అసలు విషయం గమనించం.
    చిన్నపుడు చదివిన కధలో ఐకమత్యంగా ఉన్ననాలుగు ఎద్దులు విడిపోయి ఒకటొకటిగా నసించిపోయినట్లు ముందు ముందు జరగకూడదనే నా ఆశ.

    తెలంగాణాకు బెనిఫిట్ గనుక ఎంతసేపు కాంగ్రెస్ హై కమాండ్ ఎదురుచెప్పకూడదు, గౌరవించాలి అంటున్నవాళ్లు హైదరాబాద్ ని సీమాన్ధ్రకిస్తున్నామని అంటే వాళ్ళెంత గౌరవం చూపిస్తారో కాంగ్రెస్ మీద అప్పుడు తెలిసేది...అంతకుముందు కాంగ్రెస్ నీ సోనియా నీ యెంత గౌరవం గా చూసారో
    అందరూ చూసిందే... ఇక్కడ నేను తెలంగాణా వాళ్ళను విమర్శించడం లేదు. చెప్పిన దాంట్లో
    వాస్తవం గ్రహించమంటున్నాను.

    ఒకటి మాత్రం వాస్తవం...
    కాంగ్రెస్ దౌష్ట్యం కారణంగా పచ్చగా కలిసి ఉన్న వాళ్ళు పూర్తిగా విడిపోయినట్లే. ఖచ్చితంగా కలిసివుండటం ఇక జరగని, గుర్తించవలసిన వాస్తవం. కానీ ఈ విధమైన ద్వేషాలు రగిలించటం కాంగ్రెస్ దుర్మార్గానికి పరాకాష్ట. నాకు తెలిసి సగటు సీమాన్ధ్రుదు తెలంగాణాకు బద్ద వ్యతిరేకి కాదు.
    కాకపొతే అన్యాయంగా, హేతుబద్దత లేకుండా, చీత్కరిస్తూ, వాళ్ళ ఇష్టం వచ్చినట్లు విభజిస్తున్నరనే బాధే ఎక్కువ.

    రెండు సార్లు అధికారం కట్టబెట్టిన రాష్ట్రానికి జాతీయ (?) కాంగ్రెస్ ఇచ్చే బహుమతి ఇది.
    పాముకు పాలు పోస్తే ఏం జరుగుతుందో.......తెలుగు వాళ్లకు ఇప్పటికైనా తెలుస్తుందా?

    ఈ వికృత క్రీడలో మొత్తంగా తెలుగు వాడిని చేతకాని వాడిగా లోకానికి రుజువు పరుస్తున్నారనే గ్రాహ్యత లోపించడం చాలా సిగ్గు పడాల్సిన విషయం - మనం ఇంత చేతకాని వాళ్ళమనే
    విషయం కాంగ్రెస్ పార్టీ - మన ఎంపీలు ఎం ఎల్ ఏ లు మంత్రులు కేంద్ర మంత్రులు ప్లస్ మన ముఖ్యమంత్రి గార్ల ద్వారా - మనకు చెప్పించిన్దాకా మనకు తెలియకపోవడం మన విజ్ఞానం.

    కూర్చున్న కొమ్మను నరుక్కున్న కాంగ్రెస్ పార్టీ తెలివితేటలను గమనించి కూడా...
    ఇప్పుడే ఇలా ఇష్టారాజ్యంగ వుంటే, పొరపాట్న అధికారం గాని వస్తే ఎలా చలాయిస్తున్దొ
    ఒక పెర్సెంట్ ''తెలివి(తెలుగు)తేతలున్నోడికి'' కూడా తెలుస్తుంది.

    ఇక్కడొక విషయం మనఃక్షొభ పడుతున్న తెలుగు వాడి శాపం వూరికే పోతుందా...
    కాలం నిర్ణయించాలి.

    ఒక పాత పాట గుర్తుకొస్తూంది...

    ''చవటాయను నేను...
    నీకంటే పెద్ద చవటాయను నేను... ''

    ఒక తెలుగాయన తెలుగువాళ్ళ కోసం తెలుగువాళ్ళ గురించి
    తెలుగులో ఇంత చక్కగా ఎప్పుడో ఊహించి వ్రాయటం - మన
    తెలుగువాళ్ళ కెంత గర్వకారణం.

    ఆ పాటను గతం లో విన్నప్పుడు నవ్వొచ్చేది .....
    ఇప్పుడు వింటుంటే ...

    ReplyDelete
  4. నా అరవై ఏళ్ళ జీవితంలో నేనింతవరకూ --
    ఒక గవర్నమెంట్ తన ప్రజలపైనే - తన అధికారానికి కారణభూతులైన
    ప్రజలపైనే కక్ష కట్టి - ధర్మకర్త గా మధ్యవర్తిత్వం వహించవలసిన
    చోట - పూర్తిగా ఒకవైపే కొమ్ముకాసి, పూటకో ఆబద్ధం చెబుతూ
    న్యాయాన్ని కాలరాయటం, కక్ష బూనినట్లు ఉన్మాదంగా
    ప్రవర్తించడం, విచక్షణ పూర్తిగా లోపించి నటించటం --
    మొట్టమొదటిసారిగా చూస్తున్నాను.

    దయచేసి చెప్పండి --
    హిట్లర్ ఇటలీ వాడా?

    ReplyDelete
    Replies
    1. హిట్లర్ జర్మనీ వాడు. అయితే ఇటలీ కి కూడా ఒక నియంత వున్నాడు. వాడే ముసోలినీ !

      Delete
  5. Nice Fight by Seemandra MPs. we need to elect them again........

    Great Drama.

    ReplyDelete
  6. yes, really a great drama --

    they hold the key to the existence of the government and yet they fail to open the door.

    pawar saab told, if the seemandhraa mps and minsters resign
    the government will fall like a pack of cards. yet the fighting
    seemandhraa mps and ministers wont take the clue and resign and cling to their chairs and act as if they are fighting for the cause and want the people to recognise them as the champions(?) of the cause.

    just the resignation of all central ministers and all the mps can get
    the result, even now and yet they show the people their real motives --

    to be truthful -- we don't deserve anything better for having elected
    such representatives -- the destiny chose them to be our beloved
    leaders....love them again....and on---

    ReplyDelete
    Replies
    1. please READ the sentence AS

      ''they hold the key to the EXIT of the government and yet they fail to open the door.''

      Delete
  7. like our beloved rahulji once said "congress is the only 'by default party of the country and there is no alternative" -- see, how casual and truthful is rahulji in his analysis ----- he knows people will flock to mother and child --- since indians are very sentimental towards mother and child sentiment.
    after all who cares for people, who in any way, will vote for congress and congress alone, even, though subjected to utmost humiliation. they are very much dutybound.

    after all, the country is not wishing anything better and they are very much satisfied with the good governance of the cow and calf.
    just why don't they conceive and pass an ordinance that they and
    them alone are the heirs to the throne and there will not be any election -- ever. and as always -----the bjp is ready to fall prey to the scheme and ready to support the bill, because they are very good at being amicable to the govt before and after the lunch/dinners.

    ReplyDelete