Monday, January 3, 2011

రోగం ఎక్కడుంటే మందు అక్కడే వేయాలి!

రాజధానిలొ దిగుతున్న కేంద్ర బలగాల్ని చూస్తే తెలబాన్ నాయకునికీ, వారి అనుచర గణానికీ వులుకెందుకో అర్ధం కాదు.  ఎంత సేపూ తాను చేసిన దొంగ దీక్షకి మోస పోయి 9డిసెంబర్2009 న కెంద్రమంత్రి చిదంబరం ఇచ్చిన ప్రకటన వల్లె వేస్తాడే తప్ప... జరిగిన పొరపాటు తెలుసుకున్న తరువాత అదే కేంద్ర మంత్రి 23డిసెంబర్2009నాడు దిద్దుబాటు ప్రకటన చేసారన్న విషయం ఆయనకు జ్ఞాపకముండదా??  తెలబాన్ నాయకునికి మతి మరుపు వచ్చినా రాష్ట్ర ప్రజలు సంవత్సరం క్రితం జరిగిన పీడ కల లాంటి సంఘటనలు ఇంకా మర్చి పోలేదు. గత సంవత్సరం రాష్ట్రంలో వున్న పరిస్థితి ఏమిటి?  రాష్ట్రానికి రెండు కళ్ళుగా వ్యవహరించాల్సిన వారేం చేసారు? గవర్నరేమో రాస లీలల్లో మునిగి తేలుతుంటే, ముఖ్య మంత్రేమో బాధ్యత అంతా హై కమాండుదే అంటూ నెత్తిన తడి గుడ్డ వేసుకుని కూర్చున్నాడు.  అలాంటి దారిన పోయే దానయ్య ప్రభుత్వాన్ని ఏమార్చి- రాష్ట్రంలో ప్రశాంత పరిస్థితులకి పాడె కట్టి, శాంతి భద్రతలకి బొంద పెట్టి, మొత్తం తెలుగు వారందరి పరువు ప్రతిష్టలు మంట కలిసేలా సాగిన తెలబాన్ గణం అకృత్యాలని  ఇంకా ఎవరూ మర్చి పోలేదు.  చివరికి వినొదాన్ని పంచే సినిమా రంగాన్ని కూడ విడువకుండా సీమాంధ్ర కళాకారుల్నీ, నిర్మాతల్నీ వేధించలేదా? ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ముందుగానే మేలుకొని కేంద్ర బలగాల్ని రప్పించటంతో తమ ఆగడాలు సాగవని గగ్గోలు పెడుతున్నారు. ఏమైనా ఇప్పుడు మన రాష్ట్రానికి కావలసింది రాజ్యాంగ  బధ్ధమైన పరిపాలన.  గాడి తప్పిన పరిపాలన మళ్ళీ సక్రమంగా పట్టాలెక్కే వరకు రాష్ట్రంలో ఎటువంటి అశాంతికీ, అరాచకత్వానికీ చోటు కల్పించకూడదు.  అంతే కాదు. వేర్పాటు వాదం ముసుగులో సాగిస్తున్న తీవ్ర వాద చర్యల్ని కూడ వుక్కు పాదంతొ అణిచి వేయాలి.   

5 comments:

  1. ఈ మధ్య కాలంలో నీకన్నా తీవ్రవాది ఎక్కడా కనిపించడం లేదు. ముందు నిన్ను లోపల వెయ్యాలి.

    ReplyDelete
  2. anonymous ni thagaleyyaali

    ReplyDelete
  3. a p entha venakapadipoyindo chusaaraa? ardham avuthundaa?
    oka raajakeeya nirudyogi kosam ilaa ap ni naasanam chesthunte chusthu oorukunna vaalle theevravaadi.

    ReplyDelete
  4. నిజామ్ హొస్పిటల్ కి వెల్లి నెవ్వు మున్దుగ మందు వెయీన్చ్హుకొ రామన్న

    ReplyDelete