
ముంబాయి పై సర్వ హక్కులూ మరాఠీ వారికే..ఇక్కడ మొదటి ప్రాధాన్యం వారికే అని శివసేన నాయకుడు, లోక్ సభ మాజీ స్పీకర్ మనోహర్ జోషి ఈ రోజు ప్రకటించాడు. ఎక్కడో ముంబాయి గురించి మాట్లాడితే మనకేమిటిలే అని తేలిగ్గా తీసి పారేయకండి..ఇక్కడ కూడా మన ఆంధ్రా జిన్నా అనుచర గణం ప్రత్యెక రాష్ట్రం రాక మునుపే బయటి వారిని గెంటేసి నంత పని చేస్తూ భీభత్స వాతావరణం సృష్టిస్తున్నారు కాదా? చిదంబరం గారి భాషలోనే చెప్పాలంటే ఇలాంటి వాదాలని మొగ్గలోనే తున్చేయాలి.. (నా ఇది వరకటి టపా తమిళ తంబిలని చూసైన నేర్చుకోండి చదవగలరు) . శివసేన వారికి మొదట్లో ప్రాధాన్యం, అధికారం ఇచ్చి, ఇప్పుడు వారినేమీ చేయలేక చోద్యం చూస్తున్నట్లే.. రేపు మన పరిస్థితి కూడా తయారవగలదు. తస్మాత్ జాగ్రత్త..