Wednesday, January 27, 2010

తెలంగాణా ఆచార్యుల అనాగరికం!

ఆచార్య దేవో భావ అని కీర్తించబడే వృత్తుల్లో వున్న జయ శంకర్, కోదండ రాం లు ప్రాంతీయ విభేదాల్ని రెచ్చగొట్టటం తప్ప వేరే ఏమీ చేస్తున్నట్లు లేదు. ఆంధ్రా వాళ్ళది పై చేయి అయితే హైదరాబాదు ని అమ్మేస్తారని జయ శంకర్ అనటం హాస్యాస్పదం. అసలు హైదరాబాదుని అంతర్జాతీయ స్థాయికి అభివృద్ది చేసింది గత పదునాలుగేల్లుగా వున్న రాయల సీమకి చెందిన ముఖ్య మంత్రులే కాదా? పైగా సభలు, సమావేశాలు పెట్టుకోవాలంటే కోర్టుల పర్మిషన్ తెచ్చుకోవాలా అని అడగటం ఇంకా మూర్ఖత్వం. అసలు ప్రశాంతంగా వున్న రాష్ట్రంలో ఈ పరిస్థితి తెచ్చింది ఎవరు? కడివెడు పాలల్లో విషం చుక్కలు వేసినట్లు అన్నపూర్ణ వంటి ఆంధ్ర ప్రదేశ్ ని అరాచకాన్ద్రగా మార్చింది ఎవరు? ఇంకా ప్రజల నిర్ణయం అంటూ రాజీనామాల డ్రామాలు! గత ఎన్నికల్లో తెలంగాణకి సై అంటూ మహా కూటమి ఒక వైపు, సమైఖ్యాంద్ర పక్షంలో వై.ఎస్. ఒక వైపు మోహరించారు కదా! ప్రజలు వై.ఎస్. కి అధికారం కట్ట బెట్టారంటే అర్ధం ఏమిటి? ప్రజల మాండేటు సమైఖ్యాంద్ర అని స్పష్టమైంది కదా. మరి ప్రజల వంక పెట్టి ఈ రాజీనామాల డ్రామాలు, గర్జనలు, గాండ్రింపులు, అల్లరులు ఎవరి కోసం?

2 comments:

  1. ఆచార్యుడా తూ ముందు ఈయన గారు రాజీనామా చేస్తే దరిద్రం వదులుతుంది

    ReplyDelete
  2. evari abiprayam vaarikuntundi..kaani.. atiga vimarshinche right.. samaikyavaadulaku ledu...telangana vaallaki ledu..mindlo pettukondi... YSR... modati vidatha polling jaripaka..mata marchadam meeku telise undochu.. ala evarini evaru mosagincharu..?

    ReplyDelete